ఒక కుటుంబంలో అందరూ ఒకే విధంగా ఉంటారో లేదో ఖచ్చితంగా చెప్పలేము. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం దాదాపు నేతలంతా ఒకే విధంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒకరిని మించి మరొకరు అన్నట్లుంటారు. నాలుకలు కోస్తామని హెచ్చరించటంలోనే కాదు ప్రదానిని వంగోబెట్టి కొడతామని మాట్లాడటం అంటే వారివల్లే అవుతుంది. ఎందుకంటే వారంతా తృణముల్ కాంగ్రెస్ నేతలు. బెంగాల్ దీదీ వారిని అలా ట్రైన్ చేసి పంపుతుంది. మాటలతోనే బెదిరించటం లేదంటే చేతల్లో చూపించటం వారికి జెండా కర్రతో పెట్టిన విద్య. వీరితో వేగలేక కమ్యూనిస్టులే కామ్ గా ఉన్నారంటే వీళ్ళేంటో అర్ధమవుతుంది. అలాంటి వారి కన్ను ఇప్పుడు టిడిపి ఆఫీస్ పై పడింది.
పార్లమెంటులోని టిడిపి చాంబర్ పై తృణముల్ దాడి
పారమెంటుకు ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్టీకి ఛాంబర్లు కేటాయించటం జరుగుతుంది. ఈ చాంబర్లు కొన్ని పెద్దవిగా మరికొన్ని చిన్నవిగా ఉంటాయి. దీంతో పార్టీల ఎంపీల సీట్ల సంఖ్యను బట్టి చిన్న.., పెద్ద చాంబర్లను కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపి, కాంగ్రెస్ తర్వాత అన్నా డీఎంకే, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు అత్యధిక ఎంపి స్థానాలు దక్కించుకున్నాయి. ఆ ప్రకారంగా వీరికి పెద్ద చాంబర్లు కేటాయించాలి. అయితే తమకంటే తక్కువ స్థానాలు ఉన్న టీడీపీకి పెద్ద ఛాంబర్ ఉండటంతో అది తమకు కావాలని తృణముల్ పట్టుబట్టింది. అయితే తాము ఎప్పట్నుంచో కొనసాగుతూ వస్తున్న ఆ గదిని ఖాళీ చేయమని టిడిపి ఎంపీలు కూడా అంతే స్పష్టంగా చెప్పారు. మామూలుగానే మండిపోయే తృణముల్ ఎంపీలు, అదును చూసి టిడిపి చాంబర్ పై దాడి చేశారు. టీడీపీ బోర్డులు తొలగించి తమ పార్టీ బోర్డులు తగిలించేసుకున్నారు. పార్టీ కార్యాలయాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నారు. దీదీకి ఏ మాత్రం తీసిపోమని వీరంతా నిరూపించుకున్నారు. అయితే సభ్యత కల ఎంపీలుగా వ్యవహరించి ఉంటే బాగుండేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళా రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించేదని ప్రశ్నిస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more