ఒకవైపు సినిమాల్లో హీరోయిన్లు బికినీలు, స్కర్ట్స్, పొట్టిపొట్టి గౌనులు వేసుకుని, హాట్ హాట్ గా కనిపిస్తుంటే.. మరోవైపు అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే జరిమానా తప్పదంటూ వారిమీద నిషేధ వేటును వేస్తున్నారు. అంతేకాదు.. రోడ్డుమీద ఏ అమ్మాయి అయినా జీన్స్ వేసుకుని తిరిగినా గానీ, సెల్ ఫోన్లు వాడుతూ కనిపించినా గానీ వారు భారీగా జరిమానా ఖచ్చితంగా చెల్లించాల్సి వుంటుంది. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ నగర్ జాగ్వాడ్ పంచాయితీవారు ఈ విధంగా కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.
ప్రస్తుతం మన భారతదేశంలో వున్న యువకులందరూ దాదాపుగా పాశ్చాత్తదేశాల సంస్కారాలకు అలవాటుపడినవారే! పట్టణాల నుంచి చివరికి చిన్నచిన్న గ్రామాల్లో వున్నవారుసైతం జీన్స్ లు వేసుకోవడం, సెల్ ఫోన్లు వాడటం ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే ఇటీవలి కాలంలో అత్యాచారాలు రానురాను మరీ పెచ్చుమీరిపోతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ గ్రామస్థులు ఈవిధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుస్తోంది.
సాక్షాత్తూ మన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో కూడా అత్యాచారాలు ఘోరంగా జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గరనుంచి ముసలివారు దాకా చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలా వికృతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే వీటి సంఖ్య రానురాను మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ అత్యాచారాలు 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వున్న మహిళల మీదే జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో శనివారంనాడు ఆ గ్రామపెద్దలు, గుజ్జార్ సమాజ్ కమిటీ సభ్యులు అత్యాచారాలను అడ్డుకట్టవేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొంటున్నారు.
ఇకనుంచి పెళ్లికానీ అమ్మాయిలు ఎవరైనా జీన్స్ వేసుకోకూడదని, సెల్ ఫోన్లు వినియోగించరాదని ఆ గ్రామపెద్దలు తీర్మానం చేయడం జరిగింది. అలాగే మత్తుపానీయాలు కూడా తీసుకోకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. అయితే పెళ్లయినా మహిళలు సెల్ ఫోన్లు వినియోగించవచ్చునని.. జీన్స్ మాత్రం వేసుకోకూడదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విధంగా అమ్మాయిలపై నిషేధం విధించడాన్ని తెలుసుకున్న అక్కడి మహిళలు.. తమ స్వేచ్ఛను హరిస్తున్నారని నిరసనలు చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more