మలేసియాలో ఓ ఒంటరి మహిళపై దోంగ దాడికి పాల్పడటం.. అమె నుంచి బ్యాగును లాక్కునేందుకు దారుణంగా తెగబడిన చోరీ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. కేవలం మలేషియాలోనే కాదు.. ఈ వీడియోను అప్ లోడ్ చేస్తూ.. సర్కూలేట్ చేస్తున్న నెట్ జనులు.. తమ బంధుమిత్రులకు కూడా వీడియోను షేర్ చేస్తూ.. మహిళలే కాదు చిన్నారులు కూడా ఇకపై ఒంటరిగా లిప్ట్ లోకి వెళ్లకూడదంటూ సూచిస్తున్నారు. జన సంచారం వున్న మార్గాలనే ఎంచుకోవాలని కోరుతున్నారు.
అసలేం జరిగిందీ అంటే.. మలేషియాలో ఓ ఒంటరి మహిళ లిఫ్ట్ లోకి ఎక్కిడం గమనించిన ఓ దొంగ... ఆమె వెనకాల వచ్చాడు. వెనక్కు తిరిగిన అమె లిప్ట్ వైపు చూసే లోపు.. లిప్ట్ డోర్ పడిపోయింది. అప్పటివరకు ఎంతో అమాయకంగా నటించిన అగంతకుడు లిప్టు తలుపులు మూసుకోగానే అత్యంత క్రూరంగా మారిపోయాడు. లిప్ట్ లోని ఒంటిర మహిళపై అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఆమెను బ్యాగును తీసుకున్నాడు. బ్యాగు ఇవ్వకుండా ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు.
కడుపులో తన్నుతూ, తీవ్రంగా కొట్టాడు. ఎస్కలేటర్ డోర్ తెరుచుకున్న సమయంలో ఏమీ ఎరుగనట్టుగా నించున్నాడు. కాళ్లతో మహిళను పక్కకు పట్టి, లిఫ్ట్ తలుపులు మూసుకోగానే మరోసారి ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. తర్వాత ఆమె చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని పరారయ్యాడు. అత్యంత క్రూరంగా జరిగిన ఈ దాడి ఉదంతం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దారుణ సంఘటన మలేసియాలోని కౌలాలంపూర్, చెరస్ జిల్లాలో జరిగింది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం నాడు జరిగిన ఈ సంఘటన... ఫేస్ బుక్ లో పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించడం విశేషం. లిప్టులో మహిళపై దాడి చేసిన వ్యక్తిని పట్టించిన వారికీ గానీ, అతని గురించిన సమాచారం ఇచ్చిన వారికీ గానీ 10 వేల మలేసియన్ రిగ్గిట్స్ (దాదాపు లక్షా 75 వేల రూపాయలు) పారితోషికం ఇస్తామని అక్కడి పోలీసు అధికారులు ప్రకటించారు. దొంగ దాడిలో తీవ్రంగా గాయపడిన 48 ఏళ్ల మహిళ స్థానికంగా గల ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆమె పర్సులో ఐడీ కార్డు, ఏటీఎంలతో పాటు 400 రిగ్గిట్స్ నగదు కూడా ఉన్నట్టు తెలిపిందామె.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more