బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసి.. అది కాస్తా వైరల్ కాగానే వెంటనే దానిని డిలీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో అమె ఏకంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. తెలంగాణ సర్కారు తనకు ఇచ్చిన హామీలను నాలుగేళ్లు పూర్తికావస్తున్నా నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించింది. ఆమె ఇలా ట్వీట్ చేయగానే అది ఒక్కసారిగా వైరల్ అయింది. అన్ని చానళ్లలోనూ ప్రముఖంగా రావడంతో ఆ తర్వాత కాసేపటికే జ్వాల ఆ ట్వీట్ ను తొలగించింది.
ఇంతకీ అమె ఆ ట్వీట్ లో ఏం పేర్కోనిందంటే.. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తనకు స్థలం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. దీంతో పాటు ఇంటి స్థలం కోసం కూడా ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం తనకు హామి ఇచ్చి నాలుగేళ్లు అయ్యిందని అన్నారు. అయినా, ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఈ డబుల్స్ స్టార్ విమర్శించింది.
తెలంగాణ అథ్లెట్లకు ప్రోత్సాహకంగా అప్పట్లో ప్లాట్లు ప్రకటించిందని, అందులో భాగంగానే తనకూ నజరానాలు ప్రకటించిందని పేర్కొన్న జ్వాల ఇప్పటి వరకు అది అందకపోవడం బాధగా ఉందని పేర్కొంది. అయితే ఈ ట్వీట్ ను తన అకౌంట్లో మాత్రమే పోస్టు చేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఐటీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కే తారాక రామారావుకు కూడా ట్యాగ్ చేసింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more