ఒకవైపు మన భారతదేశం సాంకేతికపరంగా ఏ విధంగా అయితే దూసుకుపోతోందో.. అదేవిధంగా మూఢనమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయనడానికి తాజాగా జరిగిన సంఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. మంత్రగత్తె అనే అనుమానంతో ఏకంగా జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న మహిళలపైనే కొందరు దుండగులు చితకబాదేశారు. క్రీడావిభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మహిళ అని తెలిసి కూడా... ఆమె ఏవో మంత్రాలు చేయిస్తోందని, ఆమె వల్ల ప్రజలకు ప్రాణహాని వుందని, దొంగచాటుగా ఏవేవో చేస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు ఆమెను అతి దారుణంగా కొట్టారు.
జావలిన్ త్రోలో జాతీయ స్థాయి క్రీడల్లో పలు పతకాలు సాధించిన దెబజాని బోరాను కొందరు నిందితులు బుధవారం సాయంత్రం ఆమె మంత్రెగత్తె అన్న అనుమానంతో కట్టేసి, చితకబాదినట్లు ఎస్పీ ఎంజే మహంతా తెలిపారు. గతకొన్నాళ్లనుంచి గ్రామంలో ఏర్పడుతున్న సమస్యలకు ఆమె కారణమని, ఆమె వల్లే ఇతరులంతా చాలా నష్టపోతున్నారనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. అసోంలోని కర్బి అంగోలా జిల్లా చేరేకులి గ్రామంలో కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. జాతీయస్థాయిలో పేరుసంపాదించుకున్న ఒక మహిళ అని తెలిసి కూడా ఆమెను అతిదారుణంగా కొట్టినట్లు తెలుపుతున్నారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. అయినప్పటికీ దుండగులు ఆమెను కొట్టడం మాత్రం ఆపలేదు.
తీవ్రంగా గాయపడిన తర్వాత స్పృహ కోల్పోయిన అనంతరం ఆ అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు వెంటనే దెబజానిని ఆసుపత్రిలో చేర్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారని తెలిసింది. ఇతరుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టేశారు. ఈ ఘటన పరిమాణాన్ని తీవ్రంగా ఆలోచిస్తే.. ఎవరో కావాలనే ఆమె మీద పగ తీర్చుకోవడం కోసం ఇలా దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి వుంటాని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more