తెలంగాణ రాష్ట్రప్రభుత్వం క్రీడారంగంలో రాణించిన ప్రతిభావంతులకు బహుమతులను అందజేస్తున్న విషయం తెలిసిందే! పతకాలకు తగ్గట్టు ఒక్కొక్కరకంగా డబ్బులను, ఇతర బహుమతులతోపాటు ఇంకా ఇతరత్ర సౌకర్యాలను క్రీడాకారులకు ఆ ప్రభుత్వం ఇప్పటికీ అందజేస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు క్రీడాకారులకు తమదైన శైలిలో బహుమానాన్ని బహూకరించింది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పీవీ సింధులకు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బ్యాట్) ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ కార్లను బహూకరించారు. బ్యాట్ అధ్యక్షుడు - రాష్ట్రమంత్రి కేటీఆర్ శుక్రవారం కశ్యప్, సింధులకు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లను అందజేశారు. ఈ ఒక్కో కారు ఖరీదు రూ.9.5 లక్షలు. కామన్వెల్త్ క్రీడల్లో కశ్యప్ స్వర్ణం గెలిచినందుకు, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండు కాంస్యాలు గెలిచినందుకు సింధుకు ఈ బహుమానాలు ఇచ్చినట్లు చాముండి తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more