ఆసియా క్రీడల్లో గతంలో పోలిస్తే ఈ దఫా మన అథ్లెట్ల ప్రతిభ చాలా మెరుగయింది. పతకాల సంఖ్య కూడా పెరిగింది. అయితే చాలామంది కష్టం వృధాగా పోతుంది. చివరి వరకు వచ్చి పైనల్ మ్యాచ్ లలో ఓడిపోతున్నారు. దీంతో రజత, కాంస్య పతకాలు మనకు మిగులుతున్నాయి. ఇప్పటివరకు స్వర్ణాల సంఖ్య పది దాటలేదు. తాజాగా భారత బాక్సర్ సతీష్ కుమార్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. 91కేజీల పైచిలకు వెయిట్ తో సూపర్ హెవీ విభాగంలో సెమిఫైనల్ కు వెళ్ళిన సతీష్
ఇవాళ జరిగిన పోరులో కజకిస్థాన్ బాక్సర్ డైకో చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఆటలో ఓడిపోయినా వట్టి చేతులతో కాకుండా పతకం పట్టుకుని వస్తున్నందుకు కాస్త సంతోషించాలి. భారత బాక్సర్లకు పతకం రాలేదు అనే భావన ప్రపంచ దేశాలకు రాకుండా చేశాడు. తాజా కాంస్యంతో ఇప్పటివరకు 2014 ఆసియా గేమ్స్ లో భారత్ కు 51పతకాలు వచ్చాయి. వీటిలో 7 స్వర్ణాలు అయితే 9వెండి పతకాలు మిగిలిన 35 కాంస్య పతకాలు. క్వార్టర్ ఫైనల్ లో జోర్డాన్ కు చెందిన హుస్సేన్ పై గెలిచిన తర్వాత భారత్ కు ఖచ్చితంగా పతకంతో వస్తాను అని సతీష్ కుమార్ ధీమాగా ప్రకటించాడు. చెప్పినట్లుగానే పతకంను తీసుకువచ్చాడు. కాకపోతే అది బంగారు పతకం అయితే ఇంకా బాగుండేది అని అభిమానులు ఫీలవుతున్నారు.
సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఆసియా గేమ్స్ అక్టోబర్ 4తో ముగియనున్నాయి. మిని ఒలంపిక్స్ గా పిలిచే ఈ గేమ్స్ లో ఇప్పటివరకు చైనా అత్యధిక పతకాలు సాధింది అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ గతంతో పోలిస్తే పతకాల పరుగులో కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. కాకపోతే మనకంటే జనాభాలో, విస్తీర్ణంలో చిన్న దేశాలు చాలా వరకు ముందుండటం బాధాకరం. ఇక 25సంవత్సరాలుగా ఆసియా గేమ్స్ లో కబడ్డి కింగ్ గా నిలిచిన భారత జట్టు ఈ సారి కూడా స్వర్ణం సాధించేందుకు ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఈ దఫా పురుషుల, మహిళల జట్లు రెండూ ఇరాన్ దేశ పురుషుల, మహిళల జట్లతో ఢీ:కొంటున్నాయి. అక్టోబర్ 3(శుక్రవారం) తుది పోరు జరుగుతుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more