ప్రస్తుత నేపథ్యంలో ఆసియా క్రీడలు రసవత్తరంగా మారాయి. ఇందులో ఇండియా సీనియర్ ఆటగాళ్లు పాల్గొనకపోవడంతో భారం మొత్తం జూనియర్ ఆటగాళ్లమీదే పడింది. దీంతో వీరంతా ఈ క్రీడల్లో తమతమ సత్తా చాటి, పతకాలు గెలుస్తారా..? లేదా..? అన్నది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన మన సీనియర్ ఆటగాళ్లందరూ కొన్నికొన్ని సందర్భాల్లో తడబడి వెనుదిరిగిన సమయాలు చాలానే వున్నాయి. అటువంటిది ఈసారి జూనియర్ ఆటగాళ్లు ఎలా నెగ్గుతారోనన్నది అందరిలో ఒక్కటే టెన్షన్ మొదలయ్యింది. వివిధ కారణాల వల్ల ఈ ఆసియా క్రీడలకు దూరమైన సైనా నెహ్వాల్, లియాండర్ పేస్, సానియా మీర్జా ఇంకా తదితర ఆటగాళ్లు తప్పుకోవడంతో వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లు నియమించారు. 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఈ ఏసియన్ గేమ్స్ ఇచియాన్ లో జరగనున్నాయి.
ఇదిలావుండగా.. ఈ ఆసియా క్రీడల్లో మన తెలుగుతేజాలూ పాలుపంచుకోనున్నారు. కామన్వెల్త్ లో తమ సత్తాచాటిన ఈ క్రీడాకారులు.. ఆసియా క్రీడల్లో మెరుపులు మెరిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. అథ్లెటిక్ నుంచి ఆర్చరీ వరకు.. బ్యాడ్మింటన్ నుంచి షూటింగ్ దాకా వున్న క్రీడాకారుల దృష్టంతా పతకాలపైనే వుంది. వీరిలో ముఖ్యంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, గగన్ నారంగ్ లు వంటి తెలుగు తేజాలు తమ సత్తా చాటడానికి సిద్ధంగా వున్నారు. గతంలో గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడలకు దూరమైన సైనా నెహ్వాల్.. ఆసియా క్రీడల కోసం బెంగుళూరులో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ లో ఓటమిపాలు కావడంతో.. తన ఆటలో వున్న లోపాల్ని సవరించుకుని, ఇందులో గెలవాలనే పట్టుదలతో వుంది.
అలాగే ఆమెతోపాటు కాంస్యం సాధించిన సింధుకు భారత్ తరఫున ఎన్నో పతకాలు లభించాయి. దీంతో ఈమె ఆసియా క్రీడల్లో తప్పకుండా గెలుస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్, గురుసాయిదత్, సుమీత్ రెడ్డి పోరాడితే.. ఖచ్చితంగా పతకం వచ్చేస్తుంది. గుత్తాజ్వాల తప్పుకోవడంతో మహిళల డబుల్స్ లో పతకం వచ్చే అవకాశం పోయింది. ఇక ఎక్కువ పతకాలు వచ్చే అవకాశమున్న క్రీడల్లో షూటింగ్ ఒకటి. ఎందుకంటే.. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, కాంస్యం గెలుచుకున్న నారంగ్.. ఈసారి ఆసియా క్రీడల్లోనూ మెరిసే అవకాశం వుంది. యువ ఆగాడు కౌనస్ షెనాయ్ సత్తాచాటుతాడా లేదా అన్నది వేచి చూడాలి.
వీరితోబాటు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ఇతర ఆటగాళ్లు...
ఆర్చరీ: వెన్నం జ్యోతిసురేఖ, వర్ధినేని ప్రణీత, పూర్వాషా షిండే
జిమ్నాస్టిక్స్: అరుణరెడ్డి,
కబడ్డీ: తేజస్విని బాయి, మమత పూజారి, కవిత, నీతా దాడ్వే (కోచ్),
అథ్లెటిక్స్: నాగపురి రమేశ్ (కోచ్),
సెపక్తక్రా: రాళ్ళ నవత,
టెన్నిస్: సాకేత్ మైనేని, రిషిక సుంకర,
టేబుల్ టెన్నిస్: ఆచంట శరత్కమల్
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more