బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు పోటీగా పీసీబీ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ను ప్రవేశపెట్టింది. పాక్ లో ఆడేందుకు ఆటగాళ్లు ముందుకు రాకపోవడంతో దుబాయ్ వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 3 లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం పీఎస్ఎల్ ఆరంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ పాక్ క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కు పీఎస్ఎల్ తక్కువ కాదని పేర్కొంటూ కామెంట్లతో హోరెత్తించారు. తాజాగా పీఎస్ఎల్ కు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో పీఎస్ఎల్ లీగ్ సందర్భంగా తీసినది. ఇందులో మ్యాచ్ చూసేందుకు అభిమానుల ఆసక్తి చూపలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. గ్యాలరీలన్నీ ఖాళీగా కనిపించాయి.
దీంతో భారత క్రికెట్ అభిమానులు ఈ ఫొటో షేర్ చేసుకుంటూ, 'మా ఐపీఎల్ జరిగే సమయంలో గ్యాలరీలు ఖాళీగానే కనిపించవు. ఎప్పుడూ అభిమానులతో నిండిపోయే ఉంటాయి. మీలా కాదు' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘భూమిపై మనుషులు అత్యల్పంగా కనిపించే ప్రదేశాల్లో పీఎస్ఎల్ జరిగే చోటు ఒకటి' అని వ్యాఖ్యానించి భారత అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. ఐపీఎల్ vs పీఎస్ఎల్, మీ లీగ్ లో కనీసం ఛీర్ లీడర్స్ కూడా మైదానంలో కనిపించడం లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Places where you can hardly see any human being.#PSL pic.twitter.com/7ZPHnKnE3U
— PhD in Bakchodi (@Atheist_Krishna) February 26, 2018
Drogon doing the best he can to fil the stadium in PSL pic.twitter.com/o7QaJFEGHX
— Ritik Rai (@RitikRai619) February 27, 2018
Man of the match reward in #IPL and #PSL.. pic.twitter.com/ssqQAXcMkT
— The-Lying-Lama (@KyaUkhaadLega) February 20, 2018
isse jyada log toh mumbai indians ke coach bane huye hain pic.twitter.com/r4kUiz59wn
— Sunil- The Cricketer (@1sInto2s) February 24, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more