మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పర్యాటక జట్టు ఇంగ్లండ్ పై టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. మరో రోజు మిగిలివుండగానే ఇంగ్లాండ్ నిర్ధేశించిన స్వల్ప విజయలక్ష్యాన్ని చేధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో రెండు విజయాలను తన ఖాతాలోకి వేసుకుంది. మరో టెస్టులో విజయం సాధిస్తే.. టెస్టు సిరీస్ విరాట్ సేన వశమౌతుంది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ విజయం అందుకోవాలని ఎంతో ఆశగా ఉవ్విళ్లూరిన టీమిండియాకు నిరాశే ఎదురైంది.
మూడో టెస్టు తొలిరోజు నుంచి పర్యాటక జట్టుపై పూర్తి అధిపత్యం ప్రదర్శించిన టీమిండియా నాల్గో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ గా నిష్క్రమించనప్పటికీ మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(67 నాటౌట్;54 బంతుల్లో11 ఫోర్లు,1 సిక్స్) రాణించాడు. విజయానికి 15 పరుగుల దూరంలో ఉండగా చటేశ్వర పూజారా(25) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(6నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాల వైపు నడిపించాడు.
అంతకుముందు 78/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 90.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జో రూట్(78), హషిబ్ హమిద్(59 నాటౌట్), వోక్స్(30)లు భారత బౌలర్లను నిలువరించే యత్నం చేయడంతో మొత్తానికి 236 పరుగుల వద్ద ఇంగ్లాండ్ చాపచుట్టేసింది. హమిద్ తో కలిసి 47 పరుగులు జత చేసిన తరువాత ఓవర్ నైట్ ఆటగాడు జో రూట్ ఏడో వికెట్ గా పెవీలియన్ దారి పట్టాడు.
ఆ తరుణంలో హమిద్-వోక్స్ మద్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది, దీంతో ఈ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ జంట 43 పరుగులు జోడించిన తరువాత వోక్స్ ఔటై వెనుదిరిగాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రషిద్ డకౌట్ గా అవుటయ్యాడు. కాసేపటికే జేమ్స్ అండర్సన్(5) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more