భారత క్రికెట్ జట్టుకు కోచ్గా వచ్చే వ్యక్తి దేశంలోని క్రీడా సంస్కృతిని తప్పక అర్థం చేసుకోవాలని వన్డే టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ‘కోచ్గా వచ్చే వ్యక్తికి హిందీ తెలిసుండాలనన్నది ఎప్పుడూ సమస్య కాదు. కాకపోతే మన సంస్కృతిని అర్థం చేసుకునే వ్యక్తి కోచ్గా ఉంటే మంచిది’ అని ధోని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ మార్పు విషయంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించిన ఆయన తన భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని స్పష్టం చేశాడు. తాను కెప్టెన్గా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తాను నిర్ణయించలేనని, బోర్డే తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు.
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్గా ధోనీ రిటైరయ్యాక విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా టి-20, వన్డే ఫార్మాట్లలో ధోనీ సారథ్యం వహిస్తున్నాడు. ధోనీ వయసు (35), 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచించాలని, విరాట్కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ధోనీ మాట్లాడుతూ.. 'వచ్చే ప్రపంచ కప్నకు ఇంకా సమయముంది. ఈలోపు మార్పులు జరగవచ్చని భావిస్తున్నా' అని చెప్పాడు.
ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించడం ఓ భిన్నమైన అనుభవమని జింబాబ్వే పర్యటనకు బయలుదేరే ముందు మహీ వ్యాఖ్యానించాడు. ఈ సవాలును ఎదుర్కోవడంపై దృష్టిసారించానని చెప్పాడు.జింబాబ్వే వెళ్లే జట్టులో బ్యాటింగ్ కంటే బౌలింగ్లోనే ఎక్కువ అంతర్జాతీయ అనుభవం కనిపిస్తోందన్నాడు. ‘పేపర్ మీద బౌలింగ్ బలంగా ఉంది. బుమ్రా, బరీందర్ బాగా మెరుగయ్యారు. అక్షర్ పటేల్, చాహల్లకు వన్డేలు ఆడిన అనుభవం ఉంది. జయంత్ కూడా జట్టులో ఉన్నాడు. బ్యాటింగ్లో అయితే ప్రతి ఆటగాడికి ఓ స్లాట్ అందుబాటులో ఉండాలి.
భారత్కు ఆడాల్సి వచ్చినప్పుడు మనం అనుకున్న స్థానం దొరకదు. కానీ దొరికిన స్థానంలో కుదురుకోవడానికి ప్రయత్నించాలి. అవగాహన, మార్పు అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ప్రస్తుతానికైతే బ్యాటింగ్, బౌలింగ్ రెండు బాగానే కనిపిస్తున్నాయి’ అని మహీ వివరించాడు. ఐపీఎల్... అంతర్జాతీయ క్రికెట్తో ఎప్పటికీ సరిసమానం కాదని ధోని పునరుద్ఘాటించాడు. నైపుణ్యాన్ని గుర్తించడానికి ఓ వేదికగా మాత్రమే పనికొస్తుందన్నాడు. ఈ నెల 11 నుంచి జరిగే సిరీస్లో భారత్... మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more