భారత స్పిన్నర్ రవిచంద్రన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ ట్వంటీ 20 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన అశ్విన్ 50 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా ట్వంటీ 20ల్లో యాభై వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ లో వార్నర్ ను బోల్తా కొట్టించి ఆసీస్ జోరుకు అశ్విన్ అడ్డుకట్టవేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు వరల్డ్ ట్వంటీ 20లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ఛేజింగ్ రికార్డును మరింత మెరుగుపరుచుకున్న విరాట్ కోహ్లీ మళ్లీ ఐసీసీ టీ 20 ర్యాకింగ్స్ లో ఎగబాకాడు. తన స్థానాన్ని మెరుగుపర్చుకుని తొలి ర్యాంకుకు మళ్లీ చేరుకున్నాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20ల ఛేజింగ్ లో 15 ఇన్నింగ్స్ లు ఆడి 122.83 సగటుతో 737 పరుగులను నమోదు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
భారత్ తరపున ఇప్పటివరకూ 42 ట్వంటీ 20లు ఆడిన కోహ్లి 15 హాఫ్ సెంచరీల సాయంతో 1,552 పరుగులు నమోదు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 90 నాటౌట్. ఈ ఏడాది ఆరంభంలో అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అజేయంగా 90 పరుగులు చేసిన కోహ్లి.. మళ్లీ అదే జట్టుపై రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు(82 నాటౌట్)ను సాధించాడు. ఇది భారత్ లో కోహ్లి ఆడిన ట్వంటీ 20ల్లో అతను నమోదు చేసిన అత్యుత్తమ స్కోరు కావడం మరో విశేషం.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more