టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. భారత్ తో జరిగిన మండేలా గాంధీ సిరీస్ లో వన్డేలు, టీ-20 ఫార్మెట్ల ధోనిసేనపై సునాయాసంగా గెలిచి విజయదరహాసం ఎగురవేసిన సఫారీలు.. టెస్టులలో మాత్రం బోర్లా పడ్డారు.
నాలుగు టెస్టుల సిరీస్ లలో ఒకటి రద్దుకావడంతో జరిగిన మూడు టెస్టులలో ఓటమినే చవిచూశారు. అయినా ఆ తరువాత ప్రకటించిన ఐసిసీ ర్యాంకింగ్ లలో ప్రపంచ అత్యుత్తమ టెస్టు జట్లలో గతంలో తాము సంపాదించిన పాయింట్ల నేపథ్యంలో నెంబర్ వన్ ర్యాంకింగ్
లోనే కొనసాగుతున్నారు.
అదే ఉత్సహంతో ఇంగ్లాండ్ సిరీస్ కు వెళ్లిన సఫారీలలకు తొలి టెస్టులో చతికిలపడింది. తొలిటెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ సఫారీలపై
అధిక్యాన్ని కనబర్చింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ముందంజ వేసింది. సఫారీలు గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో ఓటమి చవిచూడటం గమనార్హం. భారత్తో టెస్టు సిరీస్ను 0-3లో సఫారీలు ఓడిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్తో తొలి టెస్టు చివరి రోజు బుధవారం 416 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 174 పరుగులకు కుప్పకూలారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ నాలుగు, అలీ మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ ఎల్గర్ (40) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ల్లో ఇంగ్లండ్
303, దక్షిణాఫ్రికా 214 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 326 పరుగులు చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more