అనుకున్నట్లుగానే జరిగింది. అసీస్ తో ఫ్రాంక్ వోరల్ ట్రోఫిలో భాగంగా మూడు టెస్టుల సిరీస్ లో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ విలవిలలాడింది. దీంతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మరో టెస్టు మ్యాచ్ ఆడకుండానే సిరీస్ తమ వశం చేసుకుంది. 460 పరుగుల విజయ లక్ష్యంతో మంగళవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 282 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. విండీస్ ఆటగాళ్లలో రామ్ దిన్(59), జాసన్ హోల్డర్(68) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఘోర ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించగా, నాథన్ లయన్ కు మూడు, పాటిన్సన్ కు రెండు, పీటర్ సిడెల్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు ఆస్ట్రేలియా ఓవర్ నైట్ స్కోరు 179/3 వద్దే రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఓవరాల్ గా 459 పరుగుల ఆధిక్యం సాధించింది. దీంతో భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆదిలో కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆ తరువాత 118 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రామ్ దిన్ -హోల్డర్ లు జట్టును ఓటమి నుంచి గట్టెక్కించే యత్నం చేశారు. కాగా, వీరిద్దరూ అవుటైన తరువాత విండీస్ కథ మళ్లీ మొదటకొచ్చింది. విండీస్ తన చివరి నాలుగు వికెట్లను 32 పరుగులకే కోల్పోయింది. దీంతో ఆసీస్ 179 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more