భారత్లో టీ-20, వన్డే సిరీస్ లలో రాణించిన దక్షిణాప్రికా జట్టు,, టెస్టు సిరీస్ లో మాత్రం చతికిలపడిపోవటం ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ను చాలానే బాధపెట్టింది. మళ్లీ టెస్టు జట్టులోకి రావాలని అన్నంతగా ఈ మాజీ కెప్టెన్ బాధపడ్డారట. తమ క్రికెటర్ల ఆట చూసిన తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే కోరిక తనలో పెరిగిందని గ్రేమ్ స్మిత్ అన్నాడు. ‘నా వయసు 34 ఏళ్లు. మరో మూడు నాలుగేళ్లు ఆడగల సత్తా నాలో ఉంది. మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ ద్వారా పోటీ క్రికెట్లోకి వస్తున్నాను. అందులో నా ప్రదర్శనను అంచనా వేసుకున్నాక... మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడతానేమో’ అని స్మిత్ అన్నాడు.
అయితే తొలి రెండు టెస్టులు ఓడినప్పటికీ నాల్గవది చివరిదైన టెస్టు మ్యాచ్ లో అమ్లా సహా జట్టు ఆటగాళ్లు మ్యాచ్ ను డ్రా చేసేందుకు పడిన కృఫిని కూడా ఆయన శ్లాఘించాడు. ప్రస్తుతం తాను మళ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి రావాలా..? వద్దా..? అన్న సందిగ్ధావస్థలో వున్నానని చెప్పుకోచ్చాడు. అయితే ముందుగా మాస్టర్స్ క్రికెట్ లీగ్ లో మంచిగా రాణించిన తరువాత, శిక్షన తీసుకుని మళ్లీ జట్టులోకి రావాలని అశిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది మార్చిలో గ్రేమ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more