భారత్, దక్షిణాఫ్రికాల మధ్య బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు వర్షార్పణమైంది. బెంగళూరులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఐదోరోజైన బుధవారం కూడా ఆట జరగలేదు. ఈ రోజు రెండుసార్లు అవుట్ ఫీల్డ్ను పరిశీలించిన అనంతరం మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
టీ20, వన్డే సిరీస్ లను భారత్ పర్యటనకు వచ్చిన సపారీలీకు కట్టబెట్టిన తరువాత, టెస్టు సిరీస్ లో రాణించి తమ ప్రతిభను నిరూపించుకుందామని ఉవ్విళ్లూరుతున్న టీమిండియాకు రెండో టెస్టులో వరణుడు అడ్డంకిగా నిలిచాడు. తొలి టెస్టులో కోహ్లీ సేన ప్రయోగించిన స్పీన్ విశ్వరూపానికి తల్లడిల్లిన సపారీలు కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫలితాన్ని విజయంగా అందించారు. రమారమి రెండో టెస్టు కూడా అదే తరహాలో సాగుతుండగా ఎడతెరపి లేని వర్షం మ్యాచ్ భవితవ్యాన్ని శాసించి రద్దు చేసేలా ప్రభావం చూపింది.
రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి రోజున సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే టీమిండియా కట్టడి చేసింది. ఒక వైపు భారత స్పిన్నర్లు బాగా రాణించడంతో పాటు ఇటు ఓపెనర్లు కూడా రాణించడంతో రెండో టెస్టు తొలి రోజున టీమిండియా పైచేయి సాధించింది. టీమిండియా బౌలర్లు రాణించడంతో సఫారీలు 214 పరుగులకే పరిమితమయ్యారు. తొలి రోజు అట ముగిసే సమయానికి భారత ఎలాంటి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించి పటిష్ట స్థాయికి చేరుకుంది. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ 45 పరుగులతో, మరో ఓపెనర్ మురళీ విజయ్ 28 పరుగులతో కొనసాగుతున్నారు, టాస్ గెలిచి తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించిన టీమిండియా మరోసారి స్పిన్ మంత్రంతో అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన సఫారీలు 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును వందవ టెస్టు అడుతున్న విధ్వంసకర బ్యాట్స్మెన్ డివిలియర్స్ ఆదుకున్నాడు. 105 బంతుల్లో 85 పరుగులు చేసి గట్టెక్కించాడు. 11 ఫోర్లు, 1 సిక్స్తో డివిలియర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏబీ తర్వాత బ్యాట్కు దిగిన మిగతా బ్యాట్స్మెన్స్ కొద్ది పరుగులకే వికెట్లు సమర్పించుకున్నారు. టీ విరామానికి ముందు డివిలియర్స్ అవుట్ కావడంతో టీమిండియా శిబిరంలో ఆనందం వెల్లివిరిచింది. ఆ తరువాత సౌతాఫ్రికా టెయిల్ ఎండర్స్ ను భారత స్పిన్నర్లు వెనువెంటనే పెవీలియన్ కు పంపారు. 214 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ లు తలో నాలుగు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించారు. పేస్ విభాగంలో వరుణ్ ఆరోన్ ఒక వికెట్ దక్కింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more