ఇన్నాళ్లూ సైలెంట్ గా వున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి టైమొచ్చింది.. అందుకే రాబోయే ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. ఆయన పోటీ చేస్తోంది రాజకీయాల నేపథ్యంలో కాదులెండి, క్రీడా నేపథ్యంలోనే! బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్ష పదవి రేసులో పోటీ చేసేందుకు గంగూలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణం పొందడంతో ఆ సంస్థ ‘బాస్’ సీటుతోపాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కూడా ఖాళీ అయ్యింది. దీంతో బెంగాల్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఇదిలావుండగా.. సోమవారం జరిగిన దాల్మియా అంత్యక్రియల సందర్భంగా.. దాల్మియా వారసత్వాన్ని కొనసాగించాలని గుంగూలీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సూచించారు. బెంగాల్ లో తనకు అత్యంత ప్రజాదరణ కలిగి వుండటంతోపాటు మమతా మద్దతు కూడా వుండటంతో.. అధ్యక్ష పదవి చేపట్టడం గంగూలీకి సులువుగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు.. అతనికి ఆ పదవి వరిస్తుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కానీ.. ఇక్కడో చిన్న మెలిక కూడా వుంది. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో గంగూలీకి అనుభవం లేదు. ఇదే అతనికి మైనస్ పాయింట్. దీని కారణంగా ఆయనకు ఆ అధ్యక్ష పదవి దక్కకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా వ్వవహరిస్తున్న గంగూలీకి అధ్యక్ష పదవి వరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే!
మరోవైపు బలంగా వినిపిస్తున్న వార్తలేమిటంటే.. ఈ అధ్యక్ష పదవిని దక్కించుకోవడం కోసం గంగూలీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీదీ అతనికి మద్దతు ప్రకటించగా.. ఆమె అండదండలతోనే దాన్ని కైవసం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడట. అందుకే.. ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్నాడని సమాచారం.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more