క్రీడారంగానికి చెందిన మైదానాల్లోనే కొందరు ఆటగాళ్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా క్రికెట్ మైదానంలోనే ఎక్కువ సంభవిస్తున్నాయి. ఆమధ్య లూయిస్ ఫిలిప్ తలకు బంతి తగలడంతో మైదానంలో కుప్పకూలగా, ఆ తరహాలోనే ఇండియాలోనూ ఓ ఆటగాడు మైదానంలో స్పృహ కోల్పోగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పుడు తాజాగా ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రాహుల్ సావంత్ అనే ఆటగాడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.
‘డాక్టర్ హెచ్.డీ కంగా’ లీగ్ లో సావంత్ దహిసార్ క్రికెట్ క్లబ్ తరపున వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ గా ఆడుతున్నాడు. మైదానంలో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో రాహుల్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చేసింది. అతని పరిస్థితి చూసి అక్కడే వున్న సహచరులు వెంటనే బాంబే హాస్పిటల్ కు తరలించారు. ముంబయి క్రికెట్ సంఘంలో వైద్య సదుపాయాలు అక్కడేవీ కనిపించకపోవడంతో వారు వెంటనే సావంత్ ను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో తీసుకెళ్లడంతో అతడి ప్రాణాలు నిలిచాయి. ప్రస్తుతం సావంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ‘మరికాస్త ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలియాలి’ అని ఆటగాళ్లంతా భావించినట్లుగా తెలిపారు. దహిసార్ సీసీ కెప్టెన్ ప్రవీణ్ గోగ్రీ తెలిపాడు.
ఈ నేపథ్యంలోనే దహిసార్ సీసీ కెప్టెన్ ప్రవీణ్ గోగ్రీ మాట్లాడుతూ.. ‘సావంత్ నొప్పి భరించలేపోయాడు. ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాగేందుకు నీరు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. కంగా లీగ్ నియమావళి ప్రకారం మ్యాచ్ లు జరిగే ప్రతి మైదానంలోనూ వైద్యులను అందుబాటులో ఉంచాలి. కానీ, వారెక్కడా కనిపించలేదు. అందుకే, ఆలస్యం చేయకుండా బాంబే హాస్పిటల్ కు తీసుకువచ్చాం’ అని తెలిపాడు. సావంత్ కు మద్యం, ధూమపానం వంటి అలవాట్లు లేవని, మంచి వ్యక్తి అని చెప్పాడు. 34 ఏళ్ల సావంత్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకని వెల్లడించాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more