మూడు టెస్టుల సీరిస్ లో భాగంగా కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తడుబాటుకు గురవుతుంది. భోజన విరామ సమయం తరువాత బ్యాటింగ్ ఆరంభించిన లంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నస్టానికి 140 పరుగులు సాధించింది. కొలంబో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న లంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర.. తొలి టెస్టులో మాదిరిగానే రెండో టెస్టులో కూడా రాణించలేక పోయాడు. ఈ టెస్టులో రాణించి.. శతకాన్ని నమోదు చేస్తాడని ఎదురుచూసిన అతని అభిమానుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. రెండో టెస్టు తొలిఇన్నింగ్స్ లో సంగక్కర స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని అడిన సంగక్కర.. స్లిప్ లో వున్న రహానేకు క్యాచ్ ఇవ్వడంతో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. బ్యాటింగ్ కు దిగన లంక అదిలోనే ఓపెనర్ దిముత్ కరుణరత్నే విక్కెట్ ను చేజార్చుకుంది. ఆ తరువాత మరో ఓపెనర్ సంగక్కరతో కలసి 51 పరుగులు సాధించాడు. అంతకు ముందు సంగక్కర 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిరుమణ్ణే 28 పరుగులతో వుండగా, కెప్టెన్ మాథ్యూస్ 19 పరుగులతో వున్నారు.
అంతకు ముందు భారత్ 394 పరుగులకు అటౌట్ అయ్యింది. తొలి రోజు ఆట ముగిసే సమాయానికి ఆరు వికెట్ల నష్టాలనికి 319 పరుగులను సాధించిన కోహ్లీ సేన.. రెండో రోజున 75 పరుగులను జోడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... రెండో రోజున లంచ్ విరామ సమయం తరువాత అలౌట్ అయ్యింది. రెండో రోజున బ్యాట్స్ మెన్ కమ్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సహా తనదైన శైలితో అర్థశతకాన్ని సాధించాడు. ఆరు వికెట్ల నష్టానికి 319 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలో దిగిన కోహ్లీ సేనలో వృద్దిమాన్ సహా 117 బంతులు ఎదుర్కోని ఆరు బౌండరీలతో 56 పరుగులు సాధించాడు. అశ్విన్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ కు చేరాడు, ఆ తరువాత వచ్చిన అమిత్ మిశ్రా సహాతో జతకట్టాడు. 24 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్రా చమీరా బౌలింగ్ లో వెనుదిరిగాడు, ఆ తరువాత వచ్చిన ఇశాంత్ శర్మ, రెండు పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరగగా, ఉమేష్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో ధమ్మిక ప్రసాద్ రెండు, మ్యాధీవ్స్ రెంబు, చమీరా రెండు విక్కెట్లను సాధించగా, హెరాత్ నాలుగు వికెట్లను సాధించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more