ఐపీఎల్-8లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు మొదటిసారి తలబడినప్పుడు ధోనీసేన భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. లక్ష్యఛేదన తక్కువగా వున్నప్పటికీ చెన్నై బౌలర్ల ధాటికి కోల్ కతా ఆటగాళ్లు నిలబడలేకపోయారు. ఎంతో సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ను కోల్ కతా చేజార్చుకుంది. అంతే! అప్పటినుంచి ఆ జట్టు మీద కసి పెంచుకున్న కోల్ కతా జట్టు.. నిన్న (గురువారం) మ్యాచ్ సందర్భంగా తన పగను తనివితీరా తీర్చుకుంది.
గురువారం రాత్రి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా జట్టు చెన్నై మీద అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన గంభీర్.. ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన చెన్నై ఆటగాళ్లు మొదట్లో తడబడ్డారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెటన్లు తక్కువ స్కోరు చేసి టపీటపీమని వెనువెంటనే పవేలియన్ చేరారు. మెక్ కలమ్ (32) ఓ ఊపు ఊపేసి పవెలియన్ చేరగా.. రైనా (8), డుప్లెసిస్ (20), బ్రావో (20) స్కోరు బోర్డును కదిలించేందుకు ప్రయత్నించారు. ధోనీ (1) నిరాశపరచగా.. జడేజా (24) నేగి (27)తో కలిసి తమ జట్టును ముందుకు తీసుకెళ్తేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో బ్రాడ్ హాగ్ 4 వికెట్లు, ఆండ్ర రస్సల్ 2 వికెట్లు, యాదవ్, చావ్లాలు చెరో వికెట్ తీసుకున్నారు.
ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టు.. ముందునుంచే మంచి ప్రదర్శన కనబరుస్తూ దూసుకెళ్లింది. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప (58 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 80) తన అద్భుతమైన ఆటతో మైదానాన్ని పరుగుల వర్షంతో నింపేయడంతో.. ప్రేక్షకులు కేకలతో మారుమోగించేశారు. ఇతనికి తోడు ఆండ్రీ రస్సెల్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 52) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించడంతో.. ఒక్క బంతి మిగిలుండగానే కోల్ కతా విజయభేరి మోగించింది. జట్టు విజయానికి దోహదపడ్డ ఆండ్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more