మెల్బోర్న్ టెస్టు రసకందాయంలో పడింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించినా.. మ్యాచ్ ఎటువైపు మొగ్గుచూపుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నాల్గవ రోజున భారత్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అస్ట్రేలియా ఆటగాళ్లను కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 65 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగోరోజు ఆట ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 261 పరుగులు సాధించింది. షాన్మార్ష్ 62, హారిస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఓవరాల్గా 326 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ జట్టు నిలిచింది. మ్యాచ్ ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఐదోరోజు ఆసీస్ వీలైనంత ధాటిగా ఆడి.. ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆతిథ్య జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుందో... చేతులెత్తేస్తుందో... డ్రా చేసుకుంటుందో ఐదోరోజు తేలనుంది.
నాల్గవ రోజు ఉదయం ఆట ప్రారంభించిన భారత్ టెయిల్ ఎండర్స్ విఫలం కావడంతో తొలిఇన్నింగ్స్ లో భారత్ అస్లీస్ కన్నా 65 పరుగుల ఆదిక్యాన్ని సాధించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 530 పరుగులు చేయగా, భారత్ 465 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో రోజర్స్(69), షాన్మార్స్(62 నాటౌట్) అర్థసెంచరీలతో రాణించారు. డేవిడ్ వార్నర్ 40, వాట్సన్ 17, స్మిత్ 14, జాన్సన్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్శర్మ 2, అశ్విన్ 2, మహ్మద్ షమి ఒక వికెట్ తీశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more