2013లో ఐపీఎల్-6 సీజన్ లో ఫిక్సింగ్ స్కామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే! ఫిక్సింగ్ కు పాల్పడిన కొందరు ఆటగాళ్లపై అప్పటికప్పుడే బహిష్కరణ వేటు వేయగా... ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రేమయముందా..? అనే కోణంలో ముద్గల్ కమిటీ విచారణను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొందరు క్రికెట్ ఆటగాళ్లు, ప్రముఖుల పేర్లతోబాటు ఐసీసీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ సహా యజమాని ఎన్. శ్రీనివాసన్ పేర్లు బయటకొచ్చాయి. ఎవరిపేర్లయితే వెల్లడయ్యాయో వారితో కమిటీ ప్రశ్నోత్తరాలు జరిపి, అందులో భాగంగా పూర్తి వివరాలను సేకరించింది. రకరకాలుగా తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టిన కమిటీ.. తాజాగా అందుకు సంబంధించి కొన్ని వివరాలను సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీనివాసన్ ప్రమేయం లేదని ఆ ముద్గల్ కమిటీ సుప్రీంకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే శ్రీనివాసన్ అల్లుడైన గురునాథ్ మెయ్యప్పన్ గురించి ప్రస్తావిస్తూ... ఆయన ఒక హోటల్ లో బుకీని కలిసినట్టు తెలిపింది. కానీ.. అతడు బెట్టింగ్ లో పాల్గొన్నాడని చెప్పేందుకు తమ దగ్గర సరియైన సాక్ష్యాలు లేవని వివరించింది. ఇక ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్, రాజస్తాన్ టీం సహయజమాని రాజ్ కుంద్రాలు కూడా బుకీలతో టచ్ లో ఉండేవారని తమ దర్యాప్తులో వెల్లడైందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇంకా ఇతరత్ర విషయాలను దర్యాప్తు చేయవలసి వుందని ఆ కమిటీ తెలిపింది.
ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీం... కేసు విచారణను ఈ నెల 24వ తేదికి వాయిదా వేసింది. ఆ రోజు ఫిక్సింగ్ స్కామ్ లో వున్న నిందితులంద హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు.. సుప్రీం ఇచ్చిన గడువు తేదీలోపు కమిటీ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్కామ్ నుంచి శ్రీనివాసన్ మేనల్లుడు కూడా తప్పించుకుంటాడా..? లేదా..? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరి సుప్రీం 24వ తేదీన ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more