బుధవారం (17-09-2014) నుంచి ప్రారంభం అవుతున్న ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా.. హైదరాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తోనే ఈఏడాది తొలి సీఎల్టీ టోర్నీ ప్రారంభం కానుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ పై నగరవాసులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇద్దరి జట్లలోనూ కావలసినంతమంది స్టార్ ఆటగాళ్లు, అనుభవం వున్న యువతరంతో పరస్పరం తలపబడుతున్న ధోనీ, గంభీర్ సేనల మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం కొనసాగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలావుండగా.. ఈసారి కోల్ కతాకు గాయాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. క్రిస్ లిన్, మోర్నీ మోర్కెల్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ బోర్డు నిరభ్యంతర పత్రం ఇవ్వనికారణంగా షకీబ్ అల్ హసన్ కూడా ఆడటం లేదు. దీంతో గంభీర్ సారధ్యంలోనే వున్న యూసుఫ్ పఠాన్, ఉతప్ప, మనీష్ పాండే లాంటి ఆటగాళ్లమీదే మొత్తం టీం ఆధారపడి వుంది. ఇక బౌలింగ్ లో కలిస్, టెన్ డస్కటే, పేసర్ కమ్మిన్స్తో పాటు అత్యంత కీలకమైన సునీల్ నరైన్ లు వున్నారు.
గంభీర్ జట్టుకు ధీటుగానే ధోనీ జట్టు కూడా వుంది. గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైన ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈసారి ఇందులో తిరిగి వచ్చేశాడు. మెకల్లమ్, డు ప్లెసిస్, డ్వేన్ స్మిత్లతో ముగ్గురు నాణ్యమైన విదేశీ బ్యాట్స్మెన్ లతోబాటు.. రైనా, ధోనిల రూపంలో ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆల్రౌండర్లు అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యత తీసుకుంటారు. ఇక పేసర్లుగా ఈశ్వర్ పాండే, మోహిత్ శర్మ, నెహ్రా తుది జట్టులో ఉండొచ్చు. మొత్తం మీద చెన్నై జట్టు బాగా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ జట్ల మధ్య సాగనున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారోనన్న సందేహం రసవత్తరంగా మారింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more