మన తెలుగు తేజం అంబటి రాయుడికి అద్రుష్టం తలుపు తట్టింది. విండీస్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో రాయుడికి జట్టులో స్థానం లభించింది. భారత కెప్టెన్ ఎంఎస్ ధోని మొదటి మ్యాచ్ లో గాయం పాలయ్యాడు. కండరాల నొప్పితో బాధ పడుతున్న అతను ఆ తర్వాత జట్టు ఫీల్డింగ్ సమయంలోనూ మైదానంలోకి దిగలేదు. ఆ గాయం బాధిస్తుండటంతో ఈయన ట్రై సిరీస్ నుండి తప్పుకున్నాడు. దీంతో రాయుడుకి పిలుపు వచ్చింది. దీంతో రాయుడు త్వరలో జట్టు సభ్యులతో కలవనున్నాడు. ముక్కోణపు టోర్నీలోని మిగిలిన మ్యాచ్లకు విరాట్ కోహ్లి కెప్టెన్గా వ్యవహరిస్తాడని కూడా బోర్డు వెల్లడించింది. గతంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లకు రాయుడు ఎంపికయినా, అతనికి తుది జట్టుస్థానం దక్కలేదు. మరి ఈసారి వచ్చిన అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more