మానవుడు ప్రకృతిలో వున్న అందాలను, మాయకు లోబడి, ఇంద్రియాలకు లోనయి అనేకరకాల ప్రవృత్తుల (లక్షణాలు)తో ప్రవర్తిస్తుంటాడు. కొందరు ఒక్కొక్క రకమైన లక్షణాలను కలిగివుంటే.. మరికొందరిలో అన్ని లక్షణాలు ఇమిడి వుంటాయి. అవి తామసిక, రాజసిక, సాత్విక అంటూ అనేక రకాల ప్రవృత్తులు వుంటాయి. సమాయాలను బట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా తమ లక్షణాలు బయటపడతాయి.
ఇటువంటి లక్షణాలు ప్రతిఒక్కరిలో వుండటం సహజమైన విషయం. కానీ దానిని గ్రహించి మనలో వున్న లక్షణాలను పసిగట్టి.. మంచి, చెడుకు మధ్య తేడాలను తెలుసుకోగలిగినప్పుడే మనం జీవితంలో ఒక మెట్టును దాటగలం. కానిని ఇది అసాధ్యం.
ఇలా మానవునిలో వున్న అనేకరకాల లక్షణాలగురించి భగవాన్ బాబా వివరిస్తూ... ‘‘మీరు అనేక రకాల పవిత్ర గ్రంథాలను చదివివుంటారు. పండితుల ప్రసంగాలు వినివుంటారు. నా (బాబా) కార్యకలాపాలను కూడా మీరు పరిశీలిస్తారు. కాని వీటివల్ల మీరేమైనా లాభం పొందుతున్నారా? మీలో వున్న లక్షణాలను గుర్తించుకోగలుగుతున్నారా? మొదటగా మన లక్షణాలలో హానికరమైన వాటిని గ్రహించి, వెంటనే వాటిని తొలగించుకోవాలి. అప్పుడే సాత్విక లక్షణాలు పెంచుకోగలుగుతారు’’ అని అనేవారు.
ఇలా మానవుడు తనగురించి తాను తెలుసుకోకుండా, తనలో వున్న దుర్గుణాలను అదుపులో పెట్టుకోకుండా వున్నప్పుడు.. ఇతరుల గురించి ఏమి తెలుసుకుంటాడు. అలాంటప్పుడు పరమాత్మను గ్రహించడం సాధ్యమవుతుంది. గ్రహించడం కాదు కదా... ఆలోచించడానికి కూడా వీలు కాదు.
అందుకే భగవాన్ బాబా అంటుంటారు.. ‘‘నా గురించి నీకేమి తెలుసు’’ అని. ‘‘మాయ తెర అడ్డుగా వున్నందువల్ల నా గురించి నువ్వు కేవలం స్వల్పభాగమే గుర్తిస్తావు. నా గురించి ఈరోజు ఒక విధంగా, రేపటిరోజు ఇంకొకవిధంగా మాట్లాడుతావు. నామీద మీకంటూ ఒక దృఢనమ్మకం లేదు. అందుకే మీకు నా గురించి ఏమి తెలుసు? కాబట్టి నా చరిత్ర గురించి రాయదలచుకున్నప్పుడు... నీకు అనుభవంలోవున్న విషయాల గురించి మాత్రమే ప్రస్తావించు. అనవసరంగా లేనిది రాయకు. అసలు నా గురించి ప్రబోధించడానికి సాహసించవద్దు’’ అని వివరించేవారు.
‘‘కలియుగంలో పతీతులైన మానవాళిని కామక్రోధాది, సర్వ కలిదోషాల నుండి వుద్ధరించి, అవినీతిని పారద్రోలి, పరస్పర సహకార, ప్రేమభావంతో సుఖసంతోషాలతో వుండేవిధంగా చేయడానికి సాయిబాబాగా నేను వచ్చాను’’ అని ఆయన ప్రకటించుకున్నారు.
‘‘విశాలమైన విశ్వంలో నాకు కావలసినంత పనుంది. కానీ నా భక్తులు నన్ను ఆహ్వానిస్తున్నారు. ఏ కార్యం చేయడానికైతే నేను అవతరించానో.. ఆ కార్యం చేయడానికి పరిత్యాగినై వెలచాను. నేను మీ వాడిని.. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి’’ అంటూ తన దేహాన్ని వదిలేశారు భగవాన్ బాబా.
(And get your daily news straight to your inbox)
Mar 20 | సాధారణంగా సామాన్య మతాచారులు, గురువులు దగ్గరకు శిష్యులు వెళ్లి, లైనుల్లో నిల్చుని.. వారి ఆశీర్వచనాలు, ప్రసాదాలు తీసుకుంటుంటారు. కానీ... భగవాన్ బాబా స్వామి అయితే తాము స్వయంగా భక్తుల దగ్గరకు వెళ్లి వారికి స్వాంతనను... Read more
Feb 18 | ‘‘శరణు’’ అంటే రక్షణ కోసం వేడుకోవడం. ఆ రక్షణ ఇచ్చేవాడు దేవుడు. సాధారణంగా మానవులు తనకు ఆపదలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక తన ఇష్టమైన దేవాన్ని రక్షణ కోసం వేడుకుంటారు. అలాగే మరికొందరు తమ... Read more
Feb 17 | వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక జ్ఞానపీఠం, చిలకలూరి పేట అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. అవి దేవజన్మ, మానవజన్మ, జంతుజన్మ. అవి ఎలా వస్తాయి..? వాటి ప్రత్యేకత ఏమిటి..?... Read more
Feb 14 | నాది, నేను అన్న భావనలు, కోరికలే దు:ఖ హేతువులు. భూమి మీద జన్మించే ప్రతి మానవుడూ తన కోసం ధనాన్నో, వస్తువులనో సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధ... Read more
Feb 14 | ప్రేమే నేను - నేనే ప్రేమ ‘‘ప్రేమ నా స్వరూపము.. నా స్వభావము.. ప్రేమే నేను. నేనే ప్రేమ’’.. అంటారు భగవాన్ సాయి. ‘‘నా జీవితమే నా సందేహం. ప్రేమే నా సందేశం’’ అంటుంటారు.... Read more