సాధారణంగా సామాన్య మతాచారులు, గురువులు దగ్గరకు శిష్యులు వెళ్లి, లైనుల్లో నిల్చుని.. వారి ఆశీర్వచనాలు, ప్రసాదాలు తీసుకుంటుంటారు. కానీ... భగవాన్ బాబా స్వామి అయితే తాము స్వయంగా భక్తుల దగ్గరకు వెళ్లి వారికి స్వాంతనను కలుగజేస్తారు. భగవాన్ అనుగ్రహించే ఈ ప్రేమ స్వభావమెంతటిదంటే.. స్వామివారు ఒక్కసారి చూస్తేచాలు... భక్తులు ఉబ్బితబ్బిబ్బైపోతారు.
భక్తుల అదృష్టం ఇంకా బాగుంటే.. దగ్గరకు వచ్చి మాట్లాడితే.. లేదా ‘బంగారూ’ అని ప్రేమగా పలకరిస్తే.. అదేవిధంగా ఇంటర్వ్యూకి రమ్మంటే.. ప్రపంచంలో వున్నదంతా తమకు దక్కినంత ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు భక్తులు.
భక్తుల ప్రతిచిన్న అవసరాన్ని తెలుసుకున్న భగవాన్ బాబా రకరకాలుగా తన ప్రేమను అందరికీ ప్రసాదిస్తుంటారు. అయితే ఇది ప్రచారం కోసం కానేకాదు.
‘‘ప్రచారంతో నాకు ఎటువంటి పనిలేదు. ఆచారమే నాకు ప్రధానం. మీరేమి భావించినా, ఏమనుకున్నా... నా సత్యమే నాకు సత్యం. ప్రేమను త్యాగం చేయడంలోనే నాకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలోనే నేను ఇంతకాలం మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చాను. మీరు ఆనందంగా వుండటమే నాకు ఆహారం’’ అని వర్ణిస్తారు భగవాన్ బాబా.
స్వామి ఈవిధంగా తన ప్రేమను ‘ఆచరణ’ రూపంలో ఎంతోమందికి ఇవ్వడమే కాకుండా.. వారు మానవజన్మ ఎత్తినందుకు పవిత్రప్రేమను పదిమందికి పంచాలని చెబుతుంటారు. ఎన్ని అవాంతరాలొచ్చినా.. ‘ఆచారమే మొదట - ప్రచారం తరువాత’ అంటారు భగవాన్.
‘‘మానవులు ఆచరణ గురించి ఆడంబరాలు పలుకుతారు. ఇవన్నీ లెక్చర్లు - ఒట్టిగ్యాస్ ఏవి పనికిరావు. ఆచరణ చూస్తే జీరో’ అంటారు బాబా. ఆడంబర భక్తుల గురించి బాధగా.. ‘గంగ గోవు పాలు గరిటడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు’ అన్నట్లు ఏ ఒక్క మంచినైనా ఆచరణలో పెట్టాలి అదే చాలు అంటారు.
‘‘భగవద్గీతను పారాయణం చేస్తారు.. శ్లోకాలను కంఠస్థం చేస్తారు.. కానీ ఏం ప్రయోజనం? ఏ గూళ్లోకో, హరికథకో వెళ్లి కూర్చుంటే చేసేదంతా అనవసర ప్రసంగాలు, ఆడంబరాలు అనేకత్వ ప్రదర్శనలు. భగవద్గీత, బైబిలు, ఖురాన్, గ్రంథసాహెబ్ మొదలైన పవిత్ర గ్రంథాలు పారాయణం చేయడానికి పుట్టలేదు. ఆచరించడానికే ఆవిర్భవించినవి. మనం వాటిని ఆచరణలో పెట్టాలి. శ్లోకాలు చదివి ప్రయోజనమేంటి? ఎన్ని వ్యాఖ్యానాలు చేసి ఏం ప్రయోజనం? ఇది భక్తి అవుతుందా? కాదుకాదు.. ఇది ఆడంబరమైన తత్వం. ఈనాడు ఆకారమానవుడికంటే.. ఆచార మానవుడు అత్యవసరం’’ అని చెబుతారు స్వామి.
ఈ ప్రేమతత్వాన్ని ప్రచారంగా కాదు.. ఆచారంగా స్వీకరించాలని భగవాన్ వివరిస్తున్నారు. ప్రేమతత్వం పట్టుబడాలంటే.. భ్రమకి, బ్రహ్మకి మధ్య వున్న వ్యత్యాసం గుర్లించాలని చెబుతున్నారు బాబా.
‘‘ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించడం భ్రమ... అనేకత్వాన్ని ఏకత్వంగా స్వీకరించడమే బ్రహ్మ! వేదంలో కూడా ‘సహనావవతు సహనౌభునక్తు; సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై’’ అని ఏకత్వం భోధిస్తూంది.
వేదం బోధించే సూక్తులను మానవులు గుర్తించి.. దానిని ఆచరణలో పెట్టుకోవాలి. ఎటువంటి జాతి, పిత, మత భేదాలు లేకుండా సర్వజీవులకు ప్రాణ సమానమైనది.. అనంతమైన విశాల భావాములతో కూడినది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | మానవుడు ప్రకృతిలో వున్న అందాలను, మాయకు లోబడి, ఇంద్రియాలకు లోనయి అనేకరకాల ప్రవృత్తుల (లక్షణాలు)తో ప్రవర్తిస్తుంటాడు. కొందరు ఒక్కొక్క రకమైన లక్షణాలను కలిగివుంటే.. మరికొందరిలో అన్ని లక్షణాలు ఇమిడి వుంటాయి. అవి తామసిక, రాజసిక,... Read more
Feb 18 | ‘‘శరణు’’ అంటే రక్షణ కోసం వేడుకోవడం. ఆ రక్షణ ఇచ్చేవాడు దేవుడు. సాధారణంగా మానవులు తనకు ఆపదలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక తన ఇష్టమైన దేవాన్ని రక్షణ కోసం వేడుకుంటారు. అలాగే మరికొందరు తమ... Read more
Feb 17 | వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక జ్ఞానపీఠం, చిలకలూరి పేట అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. అవి దేవజన్మ, మానవజన్మ, జంతుజన్మ. అవి ఎలా వస్తాయి..? వాటి ప్రత్యేకత ఏమిటి..?... Read more
Feb 14 | నాది, నేను అన్న భావనలు, కోరికలే దు:ఖ హేతువులు. భూమి మీద జన్మించే ప్రతి మానవుడూ తన కోసం ధనాన్నో, వస్తువులనో సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధ... Read more
Feb 14 | ప్రేమే నేను - నేనే ప్రేమ ‘‘ప్రేమ నా స్వరూపము.. నా స్వభావము.. ప్రేమే నేను. నేనే ప్రేమ’’.. అంటారు భగవాన్ సాయి. ‘‘నా జీవితమే నా సందేహం. ప్రేమే నా సందేశం’’ అంటుంటారు.... Read more