ప్రేమే నేను - నేనే ప్రేమ
‘‘ప్రేమ నా స్వరూపము.. నా స్వభావము.. ప్రేమే నేను. నేనే ప్రేమ’’.. అంటారు భగవాన్ సాయి. ‘‘నా జీవితమే నా సందేహం. ప్రేమే నా సందేశం’’ అంటుంటారు. ‘‘ప్రపంచంలో ఉన్న అసమానత్వాన్ని అడుగడుగునా వెలికి తీసి వెక్కిరిస్తుంటుంది, ప్రేమ అభావం. అనేకత్వంలోని ఏకత్వాన్ని రుచి చూపి, ధరించిన దేహి - ఆత్మ చైతన్యం - ఒక్కటే సుమా, ఆ చైతన్యం ఉన్నంతవరకూ ఈ దేహాలు శివంగా మంగళకరంగా మనగల్గుతాయి.. ఆ చైతన్యం వీడిన వెంటనే ఏమీ విలువ లేని శవాలుగా శ్మశానవాటికకు తరలింపబడుతాయి. ఈ సత్యాన్ని గ్రహించండి. అర్థం చేసుకోండి. కలతలు, ద్వేషాలు, హెచ్చుతగ్గులు తగ్గించుకోండి’’.. అనేదే బాబా హెచ్చరిక. ఈ సత్యాన్ని గ్రహించే తత్వం మానవునిలో మంగళకరమైన మంచి భావాల్ని ఆవిర్భవింప చేస్తుంది. అప్పుడా మంచి భావాలు సుందరంగా రూపొంది, అతని చేత మంచి పనుల్ని చేయిస్తాయి. ఈ విధంగా మనస్సుతో మానవులలోని సమానత్వాన్ని గ్రహించే తత్వం, హృదయంతో మంచిగా వుండాలి. మంచి చేయాలనే స్పందన ఉద్భవించడం, వెనువెంటనే చేతుల్తో (క్రియలో) మంచి పనులు చెయ్యటమనే ప్రక్రియ జరుగుతాయి. ఈ త్రికరణాలు - మనస్సు, హృదయం, చేతులు భగవాన్ చెప్పే మూడు హెచ్ లు Hలు Head, Heart, Hands. ఈ త్రికరణాల శుద్ధితో, పవిత్రతతో మానవులు ప్రేమ స్వరూపాలుగా, దివ్య స్వరూపాలుగా మారుతారు. నేను వచ్చింది ఈ పవిత్ర కార్యాన్ని నెవరవేచర్చటానికి, మీలో ప్రతి ఒక్కరినీ తీర్చి దిద్దటానికే అదే నా అవతార లక్ష్యం. నా కర్తవ్యం.. అంటారు భగవాన్. భగవంతుడు యోగభూమి, త్యాగభూమి, పుణ్యభూమి అయిన పవిత్ర భారతావనిలో, వివిధ కాలాల్లో, దశావతారాల్లో వచ్చాడు. తాత్కాలిక ఫలితాలే అయినా ఆ సమయానికి, పరిస్థితులకి తగ్గట్టు ఏదో ఒక లక్ష్యసాధనకు ఏదో ఒక రూపంలో వస్తుంటాడు.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత!
అభ్యుత్థాన మ ధర్మస్య తదా త్మానం సృజామ్యహమ్!!
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్రృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
‘‘ఓ మానవుడా.. నీకు ప్రేమ లేకపోవడం చేతనే, నీకు స్వార్థం కలగడం చేతనే ఇన్ని విధాల బంధాలతో జగత్తులో చిక్కుపడి వున్నావు. త్యాగము, ప్రేమ, ధర్మము నీలో కలిగినప్పుడు దివ్యత్వమైన మానవునిగా రూపొందుతావు’’... అని భోదిస్తాడు. ఏ రూపమైనా, ఏ నామమైనా అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపిస్తూంటాడు.
భగవంతుడు ఆద్వితీయుడు, అప్రమేయుడు. అతనిని వర్ణించడానికి ఏ ప్రమాణమూ అక్కర్లేదు. రెండవ పదార్థముంటేనే పోలిక అనేది జరుగుతుంది. సర్వత్రా ఉన్నది ఒక్క సర్వేశ్వరుడే. రెండవ పదార్థమే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనే భగవత్తత్వాన్ని గుర్తింప చేసే నిమిత్తమే భగవంతుడుద్భవిస్తాడు, అందుకు మానవుడు కూడా భగవత్తత్వాన్ని గ్రహించి, గుర్తించి, అర్థం చేసుకుని తాను బ్రహ్మ యందే పుట్టి, బ్రహ్మలోనే పెరిగి, బ్రహ్మలోనే ఐక్యమవుతానన్నది తన ధ్యేయంగా భావించాలి. భగవంతుడా, నీకంటే అన్యముగా భావించ వీలు కాదు. నేను నీలోనే. నీతోనే వుండాలి. నీతోనే జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఇదే నా లక్ష్యం అనాలి. ఆ విధంగా భక్తితో, రక్తితో, అనురక్తితో, రాగంతో, అనురాగంతో భగవంతుని రకరకాలుగా ఆరాధిస్తుంటారు మనుష్యులు.
భగవంతుడెక్కడో మందిరాల్లో, మసీదుల్లో, చర్చీల్లో వున్నాడని భావించి, ప్రార్థిస్తుంటారు. భగవంతుడు తమ ప్రార్థనలకు స్పందించి, సహాయ సహకారాలందిస్తాడని ఆశిస్తారు. ఇంకా ఆక్రోశంతో విలపిస్తూ, - నీకు చెవులు లేవా, వినిపించటం లేదా ; నీది రాతి గుండె అయిపోయిందా కరగటం లేదా.. అని విల విల వేదన వెలిబుచ్చుతారు. క్రమేసి ఆధ్యాత్మికం వంట పట్టి భగవంతుడెక్కడో లేడు, నాలోనే వుంటున్నాడు. నా హృదయ పీఠికలోనే వున్నాడని విశ్వాసంతో వుంటుంటారు. నిండు సభలో కౌరవులచే అవమానింపబడి ద్రౌపది ఆవేదనతో కృష్ణభగవానుని - హే ద్వారక వాసా, మధుర నగర నివాసా.. అని మొర పెట్టుకుంటే వెంటనే ఆర్తత్రాణపరాయణుడు ఆమెకు సహాయసహకారాలందించాడు. ఆ విధంగా పరిత్రాణాయ సాధునాం... అని ఆనాడు (ఆ యుగంలో) పలికిన ప్రభువే కలియుగంలో ధర్మం క్షీణించి, మానవతా విలువలు మట్టిలోకలిసిపోయి, మనిషి తోటి మనిషిని హింసించి ఆనందించే నేపథ్యంలో భగవానుడు శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబాగా అవతరించి, ప్రేమ అనే దివ్యాస్త్రంతో ప్రపంచ రూపురేఖల్ని మార్చటానికి కృషి చేస్తున్నారు. ప్రేమ రెండక్షరముల పదమే అయినప్పటికీ దీని విలువ అత్యధికమైనది. ప్రేమ లేకున్న ప్రాణమే లేదు. ప్రేమను సత్యధర్మశాంతి అహింసల యందు అంతర్వాహినిగా ప్రవహింప చేసుకోవాలి. ‘‘ప్రేమ అంతర్వాహినిగా లేకున్న అది సత్యమూ కాదు, ధర్మమూ కాదు, శాంతమూ కాదు, అహింసా కాదు. ప్రేమ మన ఆలోచనలో, సంకల్పంలో ప్రవేశిస్తే అది సత్యం. ప్రేమను మన చర్యలలో నిరూపించిన అదే ధర్మమవుతుంది. ప్రేమతో కూడిన భావం, శాంతి, ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు అది అహింస కాదు. ప్రేమ మన ఆలోచనలో, సంకల్పంలో ప్రవేశిస్తే అది సత్యం. ప్రేమను మన చర్యలలో నిరూపించిన అదే ధర్మమవుతుంది. ప్రేమతో కూడిన భావం, శాంతి, ప్రేమను అర్తం చేసుకున్నప్పుడు అది అహింస అవుతుంది. మనోవాక్కాయ కర్మల చేత దివ్యత్వాన్ని సేవించటం భక్తి. భక్తికి రూపం ప్రేమ, దైనందిన కార్యక్రమాన్ని ప్రేమతో ప్రారంభించు, దినమంతా ప్రేమతో నింపు; ప్రేమతోనే రోజును ముగించు ; అదే భగవంతుని చేరే మార్గం.. అని ప్రేమకు నిర్వచనం చెపుతారు, భగవాన్.
గత 60 సంవత్సరాలుగా భగవాన్ బాబా సాగిస్తున్న ఈ పవిత్ర యజ్ఞంలో వీలైనంత మంది పాల్గొని, మరింకెంతో మందిని పాల్గొనేటట్లు చేసి, తమ వంతు కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించాలి. నిర్వర్తించడానికి దీక్ష పూనాలి. ప్రస్తుతం కనిపిస్తున్న బీకర ప్రళయాగ్ని సమసిపోయేటట్లు పవిత్ర ప్రేమ వాహినిని ప్రవహింప చేద్దాం. ఈ సమయంలో భగవాన్ మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం... - మీ హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించుటకే నేను వచ్చితిని. ఏ ఒక్క శర్మ ప్రచారం కోసం నేను రాలేదు. మీ ప్రేమ వాహిని విశాలమై ప్రవహించవలెను. ప్రవహించకుండా నిలిచిన నీరు దుర్గంధ భూయిష్టమగును. అందుచే ప్రేమను ప్రవహించనివ్వండి. ప్రేమయే ఆనందం, శక్తి, జ్యోతి, దైవం. నాకొక పేరు వుండాలని మీరు తలుస్తే ప్రేమ స్వరూపుడని పిలవండి.. అనేవే వారి మాటలు. ప్రస్తుత పరిస్థితుల్లో భీకర ప్రళయంకరులుగా మారణ హోమాన్ని ప్రజ్వరిల్ల చేస్తున్న వారి దుష్టభావాల్ని సమిధులుగా ఆ హోమంలోనే ఆహుతి చేసేటట్లు ప్రార్థిద్దాం. ఆ పవిత్ర హోమ గుండంలో దుష్టభావాల్ని ఆహుతి చేసి, వారు పవిత్రులై, పరిశుద్ధులై, దివ్యాత్మ స్వరూపులై, దివ్యత్వాన్ని వెదజల్లాలని ఆశిద్దాం. అట్టి దివ్యత్వంలో, ప్రేమాత్మ స్వరూపులుగా వినుతికెక్కి, వారు సమాజానికి, దేశానికి, ప్రపంచానికి విశిష్ట, విశేష సేవలందించగలగాలి., అని మనం అందం ఆశిద్దాం. ఆ విధంగా - నేనే ప్రేమ - ప్రేమే నేను - ప్రేమే నా జీవిత సందేశం‘‘ అంటూ భగవానులు చేపట్టిన దివ్యప్రేమ యజ్ఞంలో మనందరం శాంతి దూతలుగా ప్రేమ మంత్రాన్ని నలుదిశలా పఠిస్తూ పవిత్ర సేవలనందచేద్దాం. నా హృదయ పీఠికలో నాట్యమాడే దేవా అనుకుని, ప్రార్థిస్తున్న మనం, ఆ దేవదేవుడే అందరి హృదయాల్లోను కూడా నాట్యమాడుతున్నాడనే సత్యాన్ని గ్రహించి, ఆ గ్రహింపు ఫలితంగా ఆవిష్కరించే దివ్యప్రేమను అందరికీ పంచుదాం. లోకకళ్యాణానికి పాటు పడదాం.
‘‘లోకాస్సమస్తా: సుఖినోభవంతు!!’’
(And get your daily news straight to your inbox)
Apr 03 | మానవుడు ప్రకృతిలో వున్న అందాలను, మాయకు లోబడి, ఇంద్రియాలకు లోనయి అనేకరకాల ప్రవృత్తుల (లక్షణాలు)తో ప్రవర్తిస్తుంటాడు. కొందరు ఒక్కొక్క రకమైన లక్షణాలను కలిగివుంటే.. మరికొందరిలో అన్ని లక్షణాలు ఇమిడి వుంటాయి. అవి తామసిక, రాజసిక,... Read more
Mar 20 | సాధారణంగా సామాన్య మతాచారులు, గురువులు దగ్గరకు శిష్యులు వెళ్లి, లైనుల్లో నిల్చుని.. వారి ఆశీర్వచనాలు, ప్రసాదాలు తీసుకుంటుంటారు. కానీ... భగవాన్ బాబా స్వామి అయితే తాము స్వయంగా భక్తుల దగ్గరకు వెళ్లి వారికి స్వాంతనను... Read more
Feb 18 | ‘‘శరణు’’ అంటే రక్షణ కోసం వేడుకోవడం. ఆ రక్షణ ఇచ్చేవాడు దేవుడు. సాధారణంగా మానవులు తనకు ఆపదలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక తన ఇష్టమైన దేవాన్ని రక్షణ కోసం వేడుకుంటారు. అలాగే మరికొందరు తమ... Read more
Feb 17 | వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక జ్ఞానపీఠం, చిలకలూరి పేట అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. అవి దేవజన్మ, మానవజన్మ, జంతుజన్మ. అవి ఎలా వస్తాయి..? వాటి ప్రత్యేకత ఏమిటి..?... Read more
Feb 14 | నాది, నేను అన్న భావనలు, కోరికలే దు:ఖ హేతువులు. భూమి మీద జన్మించే ప్రతి మానవుడూ తన కోసం ధనాన్నో, వస్తువులనో సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధ... Read more