అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు సాగుతోందని, అభివృద్ధి కంటగింపుగా మారిన కొందరు అభూత కల్పనలను ప్రచారం చేస్తూ దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని మండిపడ్డాడు.
సంక్షేమ రంగానికి స్వర్ణయుగంలా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని, కేసీఆర్ స్వయం పర్యవేక్షణలో తమ ప్రభుత్వంలో అన్ని పనులు సవ్యంగా జరుగుతున్నాయిని కేటీఆర్ చెబుతున్నాడు. తమకు భవిష్యత్తు ఉండదనే భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ‘‘జైరాం రమేష్ పెద్ద మేధావినని చెప్పుకుంటుంటాడు. కానీ, ఆయన ఏం మేధావో తనకు అర్థం కావడం లేదు. పోలీస్ డిపార్ట్ మెంట్ కోసం కొన్న వాహనాలను షోరూంల నుంచి కొనుగోలు చేయలేదని, డైరెక్ట్ గా టయోటా కంపెనీ నుంచే కొనుగోలు చేశామని చెప్పారు. ఒక్క టయోటా వాహనాలనే కాకుండా టాటా సుమోలు, మహీంద్రా బొలెరోలు, మారుతి స్విఫ్ట్ డిజైర్, ఐషర్ బస్సులు, తదితర వాహనాలను కూడా కొన్నామని, ఆ విషయం వారికి తెలీనట్లు ఉందని చెప్పాడు.
ఇక తనకు ఏడెనిమిదేళ్ల క్రితం ట్రాక్టర్లకు సంబంధించిన ఓ వ్యాపారం ఉండేదని... మంత్రి కాకముందే దాన్ని మూసేశానని కేటీఆర్ చెప్పాడు. బోడిగుండుకు, మోకాలికి ముడి పెట్టే ప్రయత్నం చేస్తే... వాళ్లకు దణ్ణం పెట్టడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదన్నాడు. వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్షా టయోటా షోరూంల నుంచి టెండర్లు లేకుండా భారీ ఎత్తున వాహనాలను కొనుగోలు చేశారంటూ జైరాం ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను వెంకయ్య నాయుడు కూడా గతంలోనూ, తాజాగానూ ఖండించాడు కూడా.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more