పార్లమెంటు ఉభయసభల్లో భాగంగా అధికారపక్షం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు.. పెను చర్చకు దారీతీసే దిశగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు చేసిన సవరణలపై విపక్షాలతోపాటు సామాజిక ఉద్యమకార్యకర్త అన్నా హజారే యుద్ధం ప్రకటించగా.. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ బీజేపీ ఖరాఖండీగా ప్రకటించేసింది. తాము ప్రవేశపెట్టిన ఆ బిల్లు భేషుగ్గానే వుందని, అందుకు మద్దతుగా అందరూ మంత్రులు సన్నద్ధమవ్వాలంటూ ఆ పార్టీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ బిల్లుపై అస్సలు వెనక్కు తగ్గేదేలేదని ఆయన తేల్చి చెప్పేశారు.
పార్లమెంటు రెండోరోజు సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే బిల్లుపై మాట్లాడిన మోదీ.. ఆ అంశంపై సభలో ఏ విధంగా అనుసచించాలోనన్న వైఖరిపై పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అలాగే బిల్లు భేషుగ్గా వుందని, వెనక్కు తగ్గేది లేదని ఆయన ప్రకటించారు. ఆ దిశగానే పార్టీ సభ్యులు, మంత్రులు సన్నద్ధమై సమావేశాలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
* భూసేకరణ బిల్లు భేషుగ్గా వుంది. ఆ బిల్లుకు చేసిన సవరణలు బాగున్నాయి.
* ఎవరైనా దీనిపై వ్యతిరేకత భావాన్ని వ్యక్తపరిచినా అందుకు వెనక్కు తగ్గేది లేదు.
* ఇందుకు పార్టీ మంత్రులు, సభ్యులు కూడా సహకరిస్తారని నేను భావిస్తున్నాను అంటూ మోదీ పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more