సినీనటుడు తొట్టెంపూడి వేణు సమాజానికి ఉపయోగపడే పాత్రలు చేస్తే జీవితాంతం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతామని అన్నారు.‘రామాచారి’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన గుడివాడ వచ్చారు. స్థానిక మాగంటి ఆస్పత్రిలో మాట్లాడుతూ కృష్ణాజిల్లా అంటే తనకెంతో అభిమానమన్నారు. ఇప్పటివరకు 24 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందానని చెప్పారు. ‘రామాచారి’ సినిమాకు ఇంతటి ఆదరణ లభించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మంచి కథలు దొరికితే మల్టీస్టారర్ సినిమాలు చేస్తానన్నారు. కమల్హాసన్, చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూసి ఈ రంగాన్ని ఎంచుకున్నానని తెలిపారు. పెద్దవారిని గౌరవించడమే కాకుండా వృద్ధులను ఆదరించాలని వేణు హితవు పలికారు. స్థానిక బైపాస్రోడ్డులోని మమతా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆయన పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ల వల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టం వస్తోందని, త్వరలో తన బాడీకి సెట్ అయ్యే కథతో ప్రేక్షకులు ముందుకు వస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగేశ్వరరావు, మాగంటి ఆస్పత్రి డాక్టర్ మాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more