ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-ఏడబ్యూఈఎస్ (AWES) భారీగా పీఆర్టీ, టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ చేపట్టింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో 8000 పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. దేశంలోని మిలిటరీ స్టేషన్స్, కంటోన్మెంట్లల్లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లల్లో ఈ పోస్టుల్ని నియమించనుంది. అయితే దేశవ్యాప్తంగా వున్న ఈ స్కూళ్లల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్నీ పోస్టులు ఉన్నాయో ఇంటర్వ్యూ నిర్వహించే ముందు ఆయా స్కూళ్లు వెల్లడిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 21 చివరి తేదీ. కంబైన్డ్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏడబ్యూఈఎస్. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను www.awesindia.com వెబ్ సైట్ లో చూడొచ్చు. 8000 పైగా టీచర్ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ జారీ చేసిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
AWES Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు...
* ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 1
* దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 21
* అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: 2019 అక్టోబర్ 4 నుంచి
* పరీక్ష నిర్వహించే తేదీ: 2019 అక్టోబర్ 19, 20
* ఫలితాల విడుదల: 2019 అక్టోబర్ 30
PGT: పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బీఈడీ ఉండాలి.
TGT: గ్రాడ్యుయేషన్లో 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బీఈడీ ఉండాలి.
PRT: బీఈడీతో పాటు రెండేళ్ల డిప్లొమా 50% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు: ఫ్రెషర్కు 40 ఏళ్లు, అనుభవజ్ఞులకు 57 ఏళ్లు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more