రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చుట్టూ మరోమారు ఉచ్చు బిగిస్తొంది, ఆయనకు చెందిన పలు కంపెనీలపై మరోమారు కేంద్ర జీఎస్టీ అధికారులు కొరడా ఝలిపించారు. హైదరాబాదులో ఆయనకు చెందిన పలు డొల్ల కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంస్థల్లో ఆయన పలు హోదాల్లో వ్యవహరిస్తున్నట్లు పక్కా సమాచారాన్ని కనుగోన్న జీఎస్టీ అధికారులు సుమారుగా 8 నుంచి 9 షెల్ కంపెనీలు భారీ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
దీంతో ఇవాళ ఉదయం నుంచి జీఎస్టీ అధికారుల బృందం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో అధికారులు నివ్వెరపోయే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా ఈ కంపెనీల ద్వారా 1300 కోట్ల రూపాయల మేర నకిలీ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. దీనిపై 250 కోట్ల రూపాయల మేర జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించారు. ఏదీ కొనకుండా.. దేన్నీ అమ్మకుండా.. ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి.. నకిలీ టర్నోవర్ను నమోదు చేసినట్లు జీఎస్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది.
సుజనా షెల్ కంపెనీల మధ్యే ఈ అమ్మకం కొనుగోళ్లను.. కేవలం కాగితాలపైనే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే తనిఖీల్లో పట్టుబడ్డవి కాకుండా.. మరో 10 షెల్ కంపెనీలు కూడా సుజనా నేతృత్వంలో నడుస్తున్నట్లు అధికారులు పసిగట్టారు. వీటి లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని అధికారుల ద్వారా తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more