తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోమారు యూటర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం రమారమి ఖారారు చేసుకున్న చేవెళ్ల చెల్లమ్మ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ తో టీఆర్ఎస్ లోకి వెళ్లడంపై వెనక్కు తగ్గారు. ఆ తరువాత ఇవాళ మధ్యాహ్నం మరోమారు తన అనుచరులతో సమావేశమైన తరువాత.. అమె తన స్టాండును మార్చుకున్నారు. ఇక ఎవరెంత చెప్పినా.. తన తనయుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని అమె అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి తన తనయుడు కార్తీక్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించిన అమె.. ఈ విషయంలో ఇంద్రారెడ్డి అభిమానులు, కార్తీక్ రెడ్డి శ్రేయోభిలాషులతో పాటు తన అనుచరులతో కూడా సమావేశమై చర్చలు నిర్వహించారు. కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి మహిళా అమాత్యురాలిగా అమె చేత త్వరలోనే ప్రమాణం చేయించే హామీని కల్పించడంతో సబితారెడ్డి అధికార పార్టీ తీర్థం తీసుకోనున్నారు.
కుమారుడు కార్తీక్తోపాటు బుధవారం టీఆర్ఎస్ పార్టీలో ఆమె చేరనున్నారు. సబిత టీఆర్ఎస్ లో చేరతారని కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెతో చర్చలు జరిపారు. అయితే ఆయన దౌత్యం మేరకు వెనక్కి తగ్గిన సబితారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు విషయంలో స్పష్టమైన హామీ రాకపోవడంతో.. ఇక అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు రెడ్డీ అయ్యారు. రేవంత్ రెడ్డి దౌత్యం కూడా విఫలం చెందడంతో.. ఆయన ఢిల్లీ పెద్దలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై సంధిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more