మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు చేసిన పోలీసులు, ఆ మరుసటి రోజునే మరో కాంగ్రెస్ నేత గండ్ర వెంకట్రామణా రెడ్డితో పాటు ఆయన సోదరుడు గండ్ర భూపాల్ రెడ్డిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ తాజాగా మరో కాంగ్రెస్ నేత వంతు వచ్చింది. ఇటీవలి కాలంలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ నేతకు పోలీసులు శ్రీముఖాలు పంపారు.
పూర్వపు మెదక్ జిల్లాల్లో జగ్గారెడ్డి అరెస్టుతో కాంగ్రెస్ కార్యకర్తలను డోలాయమానంలోకి నెట్టిన ప్రభుత్వం.. గండ్రపై కేసు నమోదు చేసి పూర్వపు వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలను అలోచనలో పడేసింది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వంతో పాటు ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావులపై అవకాశం దోరికినప్పుడల్లా తనదైన శైలిలో విరుచుకుపడి.. తన వాగ్ధాటితో వారిని మౌనం వహించేలా చేస్తున్న కాంగ్రెైస్ నేత రేవంత్ రెడ్డి వంతు వచ్చింది.
తాజాగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటిసులు అందించారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారన్న అభియోగాలపై పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఇది తాజాగా జరిగిన కేసు కాదు. ఏకంగా దశాబ్దమున్నర కాలానికి పైగా దాటిని నాటి కేసు. ఈ కేసును కూడా తాజాగా పోలీసులు తిరగదోడి.. రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది.
2001లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై దర్యాప్తును సాగిస్తున్న పోలీసులు ఈ కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు అప్పటి అవకతవకల్లో పాలుపంచుకున్నారన్న అభియోగాలపై మొత్తంగా 13 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల వ్యవధిలో తమ ముందు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులలో పేర్కొనగా, తనకు మూడు వారాల గడువు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులను కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more