విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అలాగే, హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరడంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు కడప అనువైనదిగా పేర్కొంటూ గతంలో కేంద్ర ఉక్కు శాఖ ఇచ్చిన వివరాలను సీఎం ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.
కాగా, కడపలో ఉక్క కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇవాళ అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమను సాధించేందుకు తాను ప్రాణత్యాగానికైనా సిద్దమని స్పష్టం చేశారు. అప్పటి వరకు తన దీక్ష కొనసాగుతుందన్నారు. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని మండిపడ్డారు. ఎంపీ సీఎం రమేష్ దీక్షకు అన్ని వర్గాల ప్రజలనుంచి సంఘీభావం వ్యక్తమవుతుంది.
జిల్లా మినీ మహానాడులో ప్రకటించిన విధంగా ఆయన ఉక్కు కర్మాగారం సాధించేంతవరకు తన దీక్ష చేపడతానని కడప జడ్పీ కార్యాలయం ఆవరణలో ఆమరణ నిరాహర దీక్షకు దిగారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఉదయం తన స్వగ్రామమైన పోట్లదుర్తిలో ఆయన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేశారు. అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ కాన్వాయ్ తో కడపకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రమేశ్ మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో జిల్లా యువత కోసం ఉక్కు పరిశ్రమ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. కడప జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జగన్.. కేంద్రం అన్యాయం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడక పోవడం ఏమిటని ప్రశ్నించారు. మెకాన్ సంస్థ ఇచ్చిన ముసాయిదా నివేదికను కేంద్రం ఎందుకు తొక్కి పెట్టిందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. ఇంకా ప్రజలను మభ్య పెట్టేందుకు జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందని చెబుతూ మోసం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more