ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించడంతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కోన్న హామీలన్నింటిని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నెరవేర్చాలన్న డిమాండ్ తో రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 16న జరగనున్న రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతును ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా రాష్ట్ర బంద్ లో పాల్గోని.. బంద్ ద్వారా తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు.
అందుకోసం తమ పార్టీ ఇదివరకే ప్రకటించిన పలు నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో వామపక్ష నేతలతో భేటీ అయిన అనంతరం.. తాము ఈ నెల 15న తలపెట్టిన అనంతపురం, విజయనగరం, ఒంగోలు సభలను నిర్వహించాలని తలపెట్టామని, అయితే ఆ తరువాతి రోజునే రాష్ట్ర బంద్ కు ప్రత్యేక హొదా సాధన సమితి పిలుపునివ్వడంతో.. బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించిన పవన్ కల్యాన్.. తాను ఈ నెల 15న తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రబంద్ నేపథ్యంలో విజయనగరం, ఒంగోలు, అనంతపురం పట్టణాల్లో నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలనూ నిలిపివేసినట్టు పవన్ తెలిపారు. వామపక్షాల నేతలతో సమావేశమైన పవన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతు, కార్మికుల సమస్యలపై పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పిన ఆయన, ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా తాము మద్దతిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాలకుడై వుండి తానే నిరసన వ్యక్తం చేయడం.. దేశ ప్రజలను మోసం చేయడమేనని అరోపించారు. మోదీ వైఖరిని ఇప్పుడు ప్రజలంతా అపహాస్యం చేస్తున్నారని అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చుంటే ఎన్నో నిజాలు బయటకు వచ్చుండేవని పవన్ కల్యాన్ అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more