దళిత వర్గానికి చెందిన మైనర్ బాలికపై తన సోదరుడితో కలిసి సామూహిక అత్యాచార చేసినట్లు అబియోగాలను ఎదుర్కోంటున్న కేసులో ఎట్టకేలకు నిందితుడైన బీజేపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా బీజేపి ఎమ్మెల్యే తీరుపై నిరసనగళాలు అధికమవ్వడం.. అపై బాధిత బాలిక తండ్రిని కూడా పోలీసులు లాకప్ డెత్ చేయడంతో మిన్నంటిన అగ్రహాజ్వాలలతో ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితిలో ఎట్టకేలకు పోలీసులను అదేశించడంలో వారు తొలుత ఆయన సోదరుడు సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
కాగా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కూడా సామూహిక అత్యాచారం కేసులో నిందితుడేనని అతన్ని కూడా అరెస్టు చేయాలని బాధిత బాలిక సహా అమె కుటుంబసభ్యులు డిమాండ్ చేయడంతో కదలిన ప్రభుత్వం అతనిపై కూడా మూడు వేర్వేరు కేసులను నమోదు చేసింది. కాగా ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తున్నామని ముఖ్యమంత్రి యోగి అధిత్యనాత్ స్వయంగా ప్రకటించడంతో.. రంగంలోకి దిగిన సీబిఐ.. ఆయనపై నమోదైన మూడు వేర్వేరు కేసులను దర్యాప్తు చేస్తుంది. దళిత బాలిక గ్యాంగ్ రేప్, బాలిక తండ్రి లాకప్ డెత్ సహా మరో కేసులో బీజేపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అభియోగాలు ఎదుర్కోంటున్నాడు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎమ్మెల్యే కుల్దీప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై వివాదం నెలకొంది. అయితే కేసు సీబీఐకి అప్పగిస్తున్నందున ఆయనను అదుపులోకి తీసుకునే అంశం దర్యాప్తు సంస్థ చూసుకుంటుందని పోలీసులు స్పష్టంచేశారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయం సీబీఐ ఆయనను కేసు విషయంలో ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది. లక్నోలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు సెంగార్ ను ప్రశ్నిస్తున్నారు. విచారణ నిమిత్తం సెంగార్ ను ఉదయం 5 గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more