తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంపన్న సీఎం లో టాప్ లిస్టులో చేరిపోయారు. యావత్ భారతావనిలోని 29 రాష్ట్రాలలో మన ముఖ్యమంత్రులు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. ఇటు నిత్యం అభివృద్ది ప్రసంగాలు చేసే ముఖ్యమంత్రులు అటు క్రిమినల్ కేసులలోనూ.. మరోవైపు సంపన్న సీఎంల జాబితాలోనూ వారు సత్తాను చాటుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్యూ సంస్థలు సంయుక్తంగా జరిపిన పరిశీలనలో ఈ మేరకు పలితాలు వెల్లడయ్యాయి. దేశంలోని 29 రాష్ట్రాలు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి మొత్తంగా 31 మంది ముఖ్యమంత్రుల పై జరిపిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఘనత మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే దక్కించుకుని రికార్డు సృష్టించారు. ఆయన మొత్తం (స్థిర, చర) ఆస్తుల విలువ సుమారు రూ.177 కోట్లని సర్వే స్పష్టం చేసింది. ఇక ద్వితీయ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఏకంగా రూ.129 కోట్ల అస్తులతో నిలచారు. రూ. 48 కోట్ల అస్తులతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మూడో స్థానాన్ని ఆక్రమించాగా.. రూ.15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాలుగో స్థానంలో నిలిచారు.
దేశంలోని అత్యంత పేద ముఖ్యమంత్రుల్లో మాత్రం మళ్లి త్రిపుర సీఎం మాణిక్ సర్కారే నిలిచారు. కేవలం 26 లక్షల రూపాయల అస్తులతో ఆయన పేద ముఖ్యమంత్రుల జాబితాలో తొలి స్థానంలో ఉండగా, ఆ తరువాత దీదీ రెండోస్థానంలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం పాలన సాగిస్తున్న మమతా బెనర్జీ పేరున ఇప్పటికే కేవలం రూ.30 లక్షలను మాత్రమే వున్నాయి. అయితే మమతా బెనర్జీ వద్ద రూపాయి విలువైన స్థిరాస్తి కూడా లేకపోవడం విశేషం. ఇక జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో ఉన్నారు. ముఫ్తీ ఆస్తుల విలువ రూ.55 లక్షలని ఏడీఆర్ పేర్కొంది.
మొత్తం దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులలో బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తరువాతి స్థానంలో కేరళ మఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్పై అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పది కేసులు నమోదయ్యాయి.
దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో నేర చరిత్ర లేని ముఖ్యమంత్రులుగా ఇరవై మంది వుండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులిద్దరూ కూడా నేరచరిత్రులు గల వారి జాబితాలోనే స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబుపై మూడు కేసులు నమోదు కాగా అవి అంత తీవ్రమైన కేసులు మాత్రం కాదు. కాగా, కేసీఆర్పై నమోదైన రెండు కేసులలో ఒకటి మాత్రం క్రిమినల్ కేసు. ఇక మొత్తంగా దేశంలోని 11 మంది ముఖ్యమంత్రులపై వివిధ రకాల కేసులు ఉన్నాయి. వీటిలో 8 మందిపై మాత్రం(26 శాతం) అత్యంత తీవ్రమైన కేసులు నమోదై వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more