బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ షాపై అవినీతి ఆరోపణలు రావడం.. వాటిని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఖండించడం.. అరోపణలను ప్రచురిచిన వెబ్ పోర్టల్ పై రూ.100 కోట్ల రూపాయల మేర పరువునష్టం దావా వేసి.. దానిని వాదించేందుకు ఏకంగా ప్రభత్వ సాలిసిటరీ జనరల్ కు అప్పగించడం అంతా చూస్తుంటే.. ఇదంతా పెద్ద అవినీతి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందన్న అనుమానాలు పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా వ్యక్తం చేసిన నేపథ్యంలో అర్ఎస్ఎస్ కూడా దీనిపై స్పందించింది.
అవినీతి అరోపణలు వస్తే వాటిపై దర్యాప్తు చేయాల్సిందేనన్న సంఘ్.. ఈ ఆరోపణలు చేసిన వ్యక్తులు, అందుకు సంబంధించిన అధారాలు కూడా పరిశీలించిన తరువాతే దర్యాప్తుకు అదేశించాలని సన్నాయి నోక్కులు నొక్కింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జయ్ షా ఆస్తులు అనూహ్యంగా పెరిగిపోయాయంటూ కథనాలు రావడం.. దీనిపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తన వైఖరిని స్పష్టం చేసిన ఆరెస్సెస్.. అవినీతి ఆరోపణలు ఎవరిపైన వచ్చినా దర్యాప్తు చేయాల్సిందేనంటూనే.. ప్రాథమిక ఆధారాలు ఉండాలని నర్మగర్భవ్యాఖ్యలు చేసింది.
భోపాల్లో జరుగుతున్న ఆరెస్సెస్ సదస్సులో పాల్గొన్న సంస్థ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఇవాళ మీడియాతో మాట్లాడారు. 'ఎవరిపైనా అవినీతి ఆరోపణలు వచ్చినా దర్యాప్తు జరిపి తీరాల్సిందే. అయితే, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా ఆధారాలు ఉండాలి' అని ఆయన అన్నారు. జూనియర్ షాపై కేసు నమోదుచేసే అవకాశముందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. 'అది ఆరోపణలు చేసినవారిపై ఆధారపడి ఉంటుంది. ఆరోపణలను రుజువు చేసే బాధ్యత వారిదే' అని ఆయన పేర్కొన్నారు.
2014లో బీజేపీ అధికారంలోకి రావడంతోనే జయ్ షాకు చెందిన రెండు కంపెనీల టర్నోవర్ అమాంతం పెరిగిపోయిందని, అంతేకాకుండా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆయన కంపెనీలకు భారీ రుణాలు అందాయని 'దవైర్.ఇన్’ వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగని ప్రతిపక్షాలు ఈ అంశంపై దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేస్తున్నాయి. అవినీతి అరోపణలు విపక్షాలపై వస్తే ఒకలా. స్వపక్ష నేతలపై వస్తే మరోలా స్పందిస్తున్న తీరును ఎండగట్టాయి. సీబిఐ చేత విచారణ జరిపించి.. ప్రధాని నిజమైన అవినీతి వ్యతిరేకవాదని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more