ప్రపంచ వ్యాప్త ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ రోజుకో చోట జడలు విప్పుతూ అమాయక ప్రజలను పోట్టనబెట్టుకుంటున్న ఉగ్రవాదం.. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అలజడి సృష్టిస్తుందో అర్థంకాని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. కాగా, తాజాగా లండన్ సబ్ వే రైలులో ఉగ్రవాదులు అమర్చిన బక్కెట్ బాంబులలో ఒక్కటి పేలగా మరోకదానిని పోలీసులు నిర్వీర్యం చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే లండన్ వాసులు మాత్రం ఇంకా అ బాంబు విస్పోటనం నుంచి బయటపడినట్లు లేదు.
ఇన్నాళ్లు గాంభీరంగా కనిపించిన లండన్ వాసులు బాంబు విస్పోటనంతో ఒక్కసారిగా భయకంపితులయ్యారు. దీంతో ఏ చిన్న అలికిడి అయినా అనుమానంగా చూస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అరా తీయడానికి బదులు తాము ముందుగా దూరంగా వుంటూ చాలునని భావిస్తున్నారు. అసలు అనుమానపడాల్సిన శబ్దమేనా.. లేక కాదా..? అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా తమ జాగ్రత్త తాము తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు.
ఇంతవరకు బాగానే వున్నా.. అసలు విషయం తెలుసుకోవాల్సిన అవసరం కూడా వారిపై వుంది. అంతేకానీ భయంతో పరుగులు తీసేకొద్ది శబ్దాలు వినిపిస్తూనే వుంటే ఎంత దూరమని పరిగెడతామన్న అలోచనైనా రావాలిగా అంటున్నారు కొందరు. ఇదిలావుంచితే ఇప్పుడెందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.? అని అంటారా.,? పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో సబ్ వే రైలుతో పాటు అన్ని రవాణా మార్గాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు అత్యంత అప్రమత్తను కనబర్చడమే ఇప్పుడు వార్తైంది. అదెలా అంటే..
పిక్కాడిల్లీ నుంచి కాక్ఫస్టర్స్ వెళుతున్న ట్యూబ్ ట్రైన్లో ఓ ప్రయాణికుడు రైల్లోకూర్చుని గోళ్లు తీసుకుంటున్నాడు. ఈ సమయంలో టిక్.. టిక్.. టిక్మంటూ చప్పుళ్లు రావడంతో ఇతర ప్రయాణికులంతా భయపడిపోయారు. అతడు కిందికి చూస్తూ ఏదో బాంబు పేల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రయాణికులు అనుకున్నారో ఏమో.. రైల్లో అతడికి దూరంగా పరుగులు తీశారు. ఈ విషయాన్ని ఆ రైల్లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు గమనించి వీడియో తీశాడు. తదుపరి స్టేషన్ రాగానే రైల్లోని వారంతా కిందకు దిగేశారని ఆయన చెప్పాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త అందరికీ తెలిసిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more