మంచి తరుణం మించిన దోరకదు.. అలసిస్తే అశాభంగం తప్పదు.. ఈ డైలాగ్ వినగానే సత్యహరిశ్చంధ్ర సినిమా గుర్తుకు వచ్చినా.. ఆ మాటలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ కామర్స్ సంస్థలు ఇప్పుడు ప్రకటనలపై ప్రకటనలు గుప్పిస్తూ.. కస్టమర్లను అకట్టుకుంటున్నాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్ ను మరికొన్ని గంటల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏ వస్తువును బుక్ చేసుకుందామా.. ? అని కస్టమర్లు కూడా రెడీగా వున్నారు. రేపట్నించి ఆగస్టు 12 వరకు నాలుగు రోజుల పాటు ఈ గ్రేట్ ఇ:డియన్ సేల్ ను అమెజాన్ నిర్వహించనుంది.
ఈ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా అమెజాన్ ఆఫర్ చేయనున్న డిస్కౌంట్లు అప్పుడే బయటకు వచ్చేశాయి. పలు బ్రాండ్లపై డిస్కౌంట్లతో పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు అదనపు క్యాష్ బ్యాక్ లను అందించనున్నట్టు అమెజాన్ చెప్పింది. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్ పై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్ పై 50 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అమెజాన్ ఎక్స్ క్లూజివ్ బ్రాండ్లపైనా గ్రేట్ ఇండియన్ సేల్లో డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది ఈ కంపెనీ.
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై 2000 రూపాయల వరకు రాయితీ, ఎంపిక చేసిన మోటోరోలా మొబైల్ ఫోన్లపై 5000 రూపాయల వరకు, ఆపిల్ స్మార్ట్ ఫోన్లపై 35 శాతం వరకు రాయితీని అందించనుంది అమెజాన్. ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్ పై 31 శాతం వరకు తగ్గింపును అందించనుంది. అంతేకాక ఈ ఫోన్పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 19,470 రూపాయల వరకు తగ్గింపు ఇవ్వనుంది. అసలు ఈ ఫోన్ ధర 55 వేల రూపాయలు.
అదేవిధంగా వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ ను రూ.2000 డిస్కౌంట్తో రూ.27,999కి విక్రయానికి ఉంచనున్నట్లు కూడా తెలిపింది. పాత ఫోన్లతో ఎక్స్చేంజ్ చేసుకునే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందని తెలిసింది. ఐఫోన్ ఎస్ఈ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ పై ఏకంగా 43 శాతం డిస్కౌంట్ ను అందించనుంది. 49,999 రూపాయలు గల ఈ ఫోన్ ను 27,999 రూపాయలకే విక్రయిస్తుంది. ఎక్స్చేంజ్లో మరో 19,470 రూపాయల వరకు తగ్గింపు వస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more