తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇన్నాళ్లు సన్నాయి నోక్కులు నోక్కిన ఆయన తొలిసారిగా విమర్శలు గుప్పించారు. కొత్త రాష్ట్రంలో ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది, అందునా కోత్త ప్రభుత్వం కోలువుదీరిందని ఇన్నాళ్లు సొంత పార్టీ నేతలు అయనపై విమర్శలు గుప్పించినా.. మౌనంగానే భరించిన ఆయన కేసీఆర్ సర్కార్ రేండేళ్లు పూర్తి చేసుకున్నా.. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్న క్రమంలో మాత్రం ఆయన తన గళాన్ని విప్పారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విరుచుకుపడ్డారు.
సీమాంధ్ర నేతలు, కేంద్ర మంత్రులు సహా పలు పార్టీలు వ్యతిరేకించినా.. తమ అధినేత్రి సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని అయన గుర్తుచేశారు. ఉద్యమం సయయంలో అన్ని పార్టీలు కలసిరావడంతో తెలంగాణ ఏర్పాటయ్యిందన్న విషయాన్ని మర్చిపోరాదని, తన ఒక్కడి ఘనతే అని నిరూపించుకునేందుకు కేసీఆర్ ఇంకా తాపత్రపడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఉద్యమం పాకిస్థాన్తో చేసిన యుద్ధం కంటే ఎక్కువేమీ కాదని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, వారికి ఎన్నికల హామిని ఇవ్వడంతోనే తన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నా.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడ కూడా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయని అంటున్న టీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నేతలను తమ పార్టీలలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్టు చూపి ప్రజలను మరోమారు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఏమైందని జానారెడ్డి నిలదీశారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. పేద విద్యార్థుల విద్య మధ్యలోనే అగరాదన్న సదుద్దేశ్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అమల్లోకి తీసుకోచ్చిన ఫీజు రియంబర్స్ మెంట్ ను ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తుందని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more