మూడు రోజులు గడుస్తున్నా బంగాళాఖాతంలో కూలిపోయిన భారత వాయుసేన విమానం ఏఎన్-32 ఆచూకీ ఇంకా లభించలేదు. తమిళనాడులోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్కు శుక్రవారం ఉదయం బయలుదేరిన విమానం కొద్దిసేపటికే అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 29 మంది సిబ్బంది వున్నారు. వారిలో ఎనిమిది మంది విశాఖపట్నానికి చెందినవారు. ఘటన జరిగి 36 గంటలు దాటినా విమానం జాడ లేదు. ఇది బంగాళాఖాతంలో కూలిపోయి వుంటుందనే అనుమానంతో రక్షణ అధికారులు చెన్నై పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు.
మొత్తం 18 యుద్ధనౌకలు, ఆరు విమానాలు, 10 హెలికాప్టర్లు, ఓ జలాంతర్గామి ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రత్యేక రాడార్ సదుపాయం, అత్యంత శక్తివంతమైన కెమెరా పరికరాలున్న బీ81 రకం విమానంతోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. తాజాగా పోర్ట్బ్లెయిర్ నుండి విశ్వసద్ అనే భారీ నౌక కూడా గాలింపు చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశంలో రక్షణ శాఖ ఇప్పటివరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇదే పెద్దది. ఇంత పెద్దఎత్తున బలగాలను ఎప్పుడూ గాలింపునకు ఉపయోగించలేదని నేవీ వర్గాలు చెబుతున్నాయి.
సహ్యాద్రి, రాజపుత, రణ్విజయ్, శక్తి, జ్యోతి, సుకన్య తదితర యుద్ధనౌకలు బంగాళాఖాతాన్ని అణువణువూ గాలిస్తున్నాయి. కోస్ట్గార్డ్కు చెందిన మరో మూడు నౌకలు తీరం చుట్టూ తిరుగుతున్నాయి. నేవీకి చెందిన రెండు పీ-8ఐ నిఘా విమానాలతో పాటు డార్నియర్ విమానాలు గగనతలం నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. కూలిపోయి బంగాళాఖాతంలో మునిగిపోయి ఉంటే.. దాని జాడ పసిగట్టేందుకు, సిగ్నల్స్ను అందుకోవడానికి సబ్మెరైన ప్రయత్నిస్తోంది.
గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తమిళనాడు చేరుకున్నారు. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ సీఎస్ బిస్త్లతో కలిసి ఆయన అరక్కోణంలోని రాజాలి వైమానిక స్థావరం నుంచి నిఘా విమానం పీ-8ఐలో వెళ్లి ఏరియల్ సర్వేలో పాలుపంచుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రమాద ఘటనను అధికారులు ఆయనకు ఛాయాచిత్రాలతో వివరించారు.
గాలింపును మరింత విస్తృతం చేయాలని మంత్రి ఆదేశించడంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. త్వరగా విమానం జాడ కనుగొనేందుకు రక్షణ దళమంతా కృషి చేస్తోందని పరీకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాతావరణం గాలింపునకు అనుకూలంగా లేదని, దట్టమైన మబ్బులు కమ్ముకొని ఉండడంతో పాటు, సముద్రం కల్లోలంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఐఎనఎ్స జలాశ్వపై నుంచి హెలికాప్టర్తో నిర్వహిస్తున్న గాలింపు చర్యలను పరిశీలించారు. కన్యాకుమారిలో తమిళనాడు కోస్ట్గార్డ్ మూడు నౌకలతో విస్తృతంగా గాలిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more