ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కరోజైనా సీఎం కావాలనేది కేంద్ర మంత్రి చిరంజీవి ముందున్న లక్ష్యమని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. అందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భజన చేస్తూ ఆమె సేవలో పరితపిస్తున్నారని వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొల్ల బాబూరావు విమర్శించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి ఒక్కరోజైనా సీఎం కావాలని చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ యోచిస్తున్నారన్నారు. అందుకే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఇంట్లో భజన సమావేశం ఏర్పాటు చేసారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇందులో భాగంగా నేతలు ఆనం ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. చిరంజీవి, బొత్సలకు సీఎం కావాలనేది లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.
నోరు అదుపులో పెట్టుకో
ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని , లేదంటే తెలుగువారికి తీరని అన్యాయం జరుగుతుందని, విభజన వద్దంటూ ఉద్యమిస్తున్న వారి పట్ల కెసిఆర్ తన నోరు అదుపులో పెట్టు కోవాలని వైఎస్ఆర్ సిపి నగర కన్వీనర్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టనం పిలుపు మేరకు నగర పరిధిలోని అన్ని నియోజకవర్గంలో నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఇసుక తోట వద్ద తూర్పు నియోజకవర్గం దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న వంశీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమిస్తున్న వారి పట్ల కెసిఆర్ అవాకులు, చవకులు పేలితే సహించేది లేదని అన్నారు.
కెసిఆర్ తన నోరును అదుపులో పెట్టుకోకపోతే శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వారి నుంచి దాడిని ఎదుర్కోనకతప్పదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతాలు ఎడారిగా మారుతాయని అన్నారు. ప్రధానంగా వ్యవసాయదారులు , విద్యార్ధులతో పాటు ఉద్యోగులు, కార్మిక , వైద్య రంగాల విధానం దెబ్బతింటుందని తెలియజేశారు. జగన్మోహన్రెడ్డి సారధ్యంలో రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమిస్తామని ప్రతినబూనారు. ఏర్పాటు వాదులకు సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోనికి రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలలో తిరగబోనివ్వమని ఆయన హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more