Workers strike at visakhapatnam port

Lambasingi records lowest temperature, Workers Strike at Visakhapatnam port, Port workers go on flash strike, Lambasingi village, Lambasingi records lowest temperature

Workers Strike at Visakhapatnam port

ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

Posted: 12/17/2013 09:31 PM IST
Workers strike at visakhapatnam port

విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24 గంటలూ చలి మంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఉత్తర, వాయవ్య భారతాల నుంచి మధ్య భారతం మీదుగా రాష్ట్రంపైకి పొడి, చలిగాలులు వీస్తుండడంతో తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

 

సమ్మె సైరన్..

విశాఖ పోర్టుకు గుండెకాయలాంటి వోర్ హ్యడ్లింగ్ కాంప్లెక్స్ ను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

 

విశాఖ పోర్టు నేపథ్యం..

విశాఖ పోర్టు ఉనికిని కోల్పోవడానికి సిద్ధమవుతోంది. ప్రైవేట్ పోర్ట్ లకు ధీటుగా దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిన విశాఖ పోర్ట్ ఊపిరిని దాని పాలకులు తీసేస్తున్నారు. పోర్టు అభివృద్ధి పేరుతో అసలుకే ఎసరు పెడుతూ కార్మికుల పొట్ట కొడుతున్నారు. 26 బెర్త్ లలో ఇప్పటికే 13 బెర్త్ లను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిన ప్రభుత్వాలు తాజాగా ఆసియాలోనే అతిపెద్ద ఓర్ హ్యాండ్లింగ్‌ యునిట్‌ను అతి చౌకగా బేరానికి పెట్టేశాయి. పోర్టు ఆర్థికాభివృద్ధికి గుండెకాయలాంటి ఓర్‌ హ్యాండ్లింగ్‌ యూనిట్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీతో కలిపేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. 253 కోట్లు చెల్లిస్తే చాలు 30 సంవత్సరాల పాటు యూనిట్‌ మీదే అంటూ ఆఫర్ ఇచ్చాయి.

 

విశాఖలో ఒప్పందం జరిగితే కార్మికులు అడ్డుకుంటారన్న కారణంతో పోర్టుకు సంబంధం లేని చెన్నైలో ఒప్పందం చెయ్యడం కార్మికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. విశాఖ పారిశ్రామికాభివృద్ధికి ల్యాండ్ మార్క్ గా నిలిచిన పోర్టును ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయల రిజర్వు ఫండ్స్ ఉన్నా విశాఖ పోర్టును కేంద్ర ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నిస్తోందని కార్మికులు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. జపాన్ ఆర్థిక సహకారంతో ఓర్ హ్యాండ్లింగ్‌ యునిట్‌ను అభివృద్ధి చేసేందుకు 2006లో టెండర్లు పిలిచి, కన్సల్టెంట్‌ దొరకలేదంటూ ప్రతిపాదనల్ని పక్కకు పెట్టిన యాజమాన్యం ఒక్కసారిగా ఇప్పుడు ఎస్ఆర్ కంపెనీకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more

  • Cm attending for racha banda program in vizag

    సీఎం సభకు మంత్రి బాలరాజు గైర్హాజరు-చంద్రబాబే కారణం

    Nov 15 | విశాఖజిల్లాలోని రంప చోడవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన సీఎం కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి మంత్రి బాలరాజు హాజరు కాలేదు. రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని మంత్రి బాలరాజును మీడియా ప్రశ్నించగా... తనకు సీఎం... Read more