తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వంద కోట్లతో నిర్మించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరును మరింత అభివ్రుద్ది చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నడుంబిగించింది. తిరుమల శ్రీవేంకేటేశ్వర స్వామి తర్వాత అదే తరహాలో తిరుచానూరు శ్రీపద్మావతీదేవిని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భవిష్యత్తులో రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఆలయ పరిసర ప్రాంతాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ద్రుష్టి సారించింది. ఇందుకోసం రెండో విడద మాస్టర్ ప్లాన్ ను త్వరలో అమలు చేయనున్నారు.
ప్రధానంగా చేపట్టిన కార్యచరణ పనులు :
1. అమ్మవారి నిత్యాన్నదానంలో ప్రస్తుతం రోజుకు మూడు వేలమందికి అన్నదానం చేస్తున్నారు. రానున్న రెండేళ్లలో దాన్ని 15వేలకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిరుమల తరహాలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం భక్తులకు భోజనం.
3. స్థానిక ఆలయాల్లో మంచి నీటి కొరత తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
4. సద్మసరోవరంలో బ్రాస్ గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. నీటిని శుభ్రం చేసే యంత్రాలను ఆధునీకరించనున్నారు.
5. తిరుమలలో ఉన్న విధంగా దాతల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారికి విరాళాలు ఇచ్చే దాతలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు.
6. శ్రీ పద్మావతీదేవి ఆభరణాలను భవిష్యత్తులో ప్రదర్శించేందుకు వీలుగా ఓ భవన నిర్మాణం చేయనున్నారు.
7. అమ్మవారి రూపం స్పష్టంగా కనిపించేందుకు గర్బాలయంలో కొత్తగా ర్యాంప్ లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more