కాంగ్రెస్ కమిటీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విస్త్రుత స్థాయి సదస్సుకు కొంత మంది కాంగ్రెస్ నాయకులు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ సదస్సుకు కాంగ్రెస్ నాయకులే డుమ్మా కొట్టడం పై అనుమానాలు వస్తున్నాయని రాజకీయ నాయకులు అంటున్నారు. కేంద్ర మంత్రి , సీనియర్ నేత సూటిని జైపాల్ రెడ్డి హాజరుకాలేదట. అదేరిలో మరి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసారి రాంభూపాల్ రెడ్డి , వీర శివరెడ్డి, జయసుధ కూడా సదస్సుకు హాజరుకాలేదని మీడియా వర్గాలు అంటున్నాయి. వీరందకంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జైపాల్ రెడ్డికి , ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే జైపాల్ రెడ్డి అది మనసు లో పెట్టుకొని సదస్సుకు హాజరు కాలేదా? లేక కావాలనే రాలేదా ? అనే అనుమానం వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అదీగాక ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో జైపాల్ నివాసం సమావేశాల కేంద్రస్థానమైంది. తెలంగాణ విషయంలో ఏ విషయాన్నైన జైపాల్ తో సంప్రదించిన తర్వాతే వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఎఫ్ ఢీ ఐ ఓటింగ్ సందర్భంగా లోక్ సభకు హాజరు కాకూడదని టీ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా జైపాల్ రెడ్డి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాకపోవటానికి మరో కారణం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలాగైనా సదస్సు వేదికపై టీ విషయం ప్రస్తావిస్తామని స్పష్టం చేశారని, సదస్సులో తీర్మానం కోసం పట్టు పడతామని, కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తామని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జైపాల్ రెడ్డి సదస్సు హాజరైన పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గందరగోళం రేపుతారుకాబట్టి, వారు చేసిన రచ్చ జైపాల్ రెడ్డి అంటుకోకుండా ఉండటానికే ఆయన రాలేదని కారణం కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందువల ఆయన ముందు జాగ్రత్తగా సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉంటారని సీనియర్ నేతలు కొందరు అంటున్నారు. జైపాల్ రెడ్డికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద వైరమో? లేక తెలంగాణ వివాదం వద్దనో ? తెలియాదు గానీ మొత్తం జైపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీని పై కాంగ్రెస్ నాయకుల్లో చర్చ జరుగుతున్నట్లు సీనియర్ నేతలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more