ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ లో పర్యటించిన ఆమె స్వదేశానికి వస్తున్న క్రమంలో అమెకు చేధు అనుభవం ఎదురైంది. చివరకు చేసేది లేక అమె సింగపూర్ విమానాశ్రయంలోనే తాను ఎంతో ముచ్చటపడి కొనుకున్న విలువైన వస్తువును ఎటూతేల్చుకోలేక విమానాశ్రయంలోనే వదిలేసి రావాల్సివచ్చింది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే, సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆమె సింగపూర్ నుంచి భారత్ కు బయల్దేరింది. ఆ సమయంలో తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకొచ్చింది.
అయితే, పరికారాన్ని విమానంలోకి తీసుకురాకూడదని ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆమెకు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో విమానాశ్రయంలోనే దాని ఆమె వదిలేసింది. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ పై ట్విట్టర్ ద్వారా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. విలువైన వాయిద్య పరికరాలు ఉంటే సింగపూర్ ఎయిలైన్స్ విమానంలోకి ఎక్కనివ్వదేమో అంటూ ఎద్దేవా చేసింది. తనకు గుణపాఠం నేర్పినందుకు ధన్యవాదాలు అంటూ విమర్శించింది. ఆమె ట్వీట్ కు సింగపూర్ ఎయిర్ లైన్స్ చేతులు కాలిన తరువాత స్పందించింది.
సింగర్ శ్రేయా ఘోషల్ చేధు అనుభవంపై స్పందించిన ఎయిర్ లైన్స్ యాజమాన్యం.. అమెకు అలాంటి అనుభవాన్ని మిగిల్చినందుకు చింతిస్తున్నామని చెప్పింది. కాగా తమ సిబ్బంది మీతో ఏమన్నారో వివరంగా చెప్పాలని కోరింది. ఇలా విమానయాన సంస్థ యాజమాన్యం దిగివచ్చేందుకు శ్రేయా ఘెషల్ అభిమానులే కారణం. తీవ్రమైన పరిస్థితుల్లో తప్ప అమె సహజంగా ఎప్పుడూ ఒకర్ని విమర్శించేలా, లేదా కించపర్చేలా పోస్టులు పెట్టదని తెలుసుకున్న అభిమానులు అమెకు మద్దతుగా ట్వీట్ చేయడంతో యాజమాన్యం దిగివచ్చింది.
I guess @SingaporeAir does not want musicians or any body who has a precious instrument to fly with on this airline. Well. Thank you. Lesson learnt.
— Shreya Ghoshal (@shreyaghoshal) May 15, 2019
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more