మంచు మనోజ్ తాజా చిత్రం ‘కరెంటు తీగ’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. సినిమాను ఎప్పుడు విడుదల చేసేది తర్వాత ప్రకటిస్తామన్నారు. తుఫాను వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్లు మనోజ్ తెలిపారు. అంతేకాకుండా స్నేహితులతో కలిసి వైజాగ్ వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక తాము తిరిగి వస్తామన్నారు. ఆ తర్వాతే సినిమా విడుదల ఉంటుందని మంచు ఫ్యామిలి సన్నిహితులు చెప్తున్నారు.
మంచు మనోజ్ - రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్ గా రూపొందిన సినిమా ‘కరెంట్ తీగ’. వీరిద్దరితో పాటు జగపతి బాబు, సన్నీలియోన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాత, ఆయన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేయగా.., అచ్చు సంగీతం అందించారు. గత వారమే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కరెంటు తీగ’కు A సర్టిఫికెట్ ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 17న విడుదల కావాల్సి ఉన్నా.., తుఫాను వల్ల తాజాగా వాయిదా పడింది.
హుద్ హుద్ తుఫాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచే విశాఖ సహా మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలుల భీభత్సం మొదలయింది. గంటకు 200కి.మి వేగంతో వీచన భీకరమైన ఈదురుగాలలకు అపారనష్టం చవిచూడాల్సి వచ్చింది. తుఫాను వల్ల కోస్తాంధ్ర సహా ఇతర ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అటు చాలా ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. హుద్ హుద్ పై అప్రమత్తమైన రాష్ర్ట ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఏపీతో పాటు ఒడిశాలో ఎక్కువగా ఈ తుఫాను ప్రభావం చూపుతోంది. అటు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో కూడా హుద్ హుద్ తుఫాను వల్ల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం ఉంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more