బ్రెగ్జిట్ వల్ల ప్రపంచ మార్కెట్ల కోటానుకోట్ల సంపద హారతవ్వడం మనకు తెలిసిందే.. అయితే దీని వల్ల భారత దేశానికి వచ్చి ముప్పు ఏమీ లేదని, పైగా ముఖ్యమైన లబ్దిదారుగా అవతరించనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్రెగ్జిట్ పరిణామం మూలంగా రాబోయే కాలంలో భారత్ కు అంతా మంచి జరగనుందని ఎస్ బ్యాంక్ సీఈవో రానా కపూర్ వ్యాఖ్యానించారు. చాలా తక్కువ సమయంలోనే మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత ఆర్థిక సంబంధాల్లో ప్రతికూల వెల్లువ ఉంటుందని తెలిపారు.
ఆ తరువాత ఆరు నెలల్లో అమెరికాలో వడ్డీ రేటు పెంపులో ఆలస్యం కూడా దీనికి మరింత తోడ్పడుతుందన్నారు. ఈ అసమంజసమైన అస్థిరతను ఎదుర్కొనే సత్తామన పాలకులకు ఉందంటూ, ప్రభుత్వం సంస్థాగత ఆర్థిక సంస్కరణలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమ పెట్టుబడులకు ఇండియాను కేంద్రంగా ఎంచుకుంటారని, వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులు భారత్ వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. కనుక ఈ పరిణామం బ్యాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ లాంటిదని సీఈవో కపూర్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా, ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, భారతదేశం మాత్రం స్థిరంగా నిలబడిందన్నారు. సంస్థాగత, నిర్మాణ చర్యల ద్వారా తన ఆర్థిక సత్తాను చాటుకుందని కపూర్ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో సరళీకరణ, జీఎస్టీ బిల్లు లాంటి కీలక సంస్కరణల్లో ప్రభుత్వం పట్టుదల భారతదేశ అభివృద్ధికి సహాయపడుతుందన్నారు. . అలాగే బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగే అంశం పూర్తిగా ఊహించనిది కాదనీ, ఈ ఆందోళన మొత్తం తదుపరి వారాంతానికి మాయమవుతుందని కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more